ఐదు సంవత్సరాల క్రితం అన్యాయంగా జరిగిన రాష్ట్ర విభజన కారణంగా కట్టుబట్టలతో అమరావతికి వచ్చామని, తనపై విశ్వాసంతో పసిబిడ్డ వంటి రాష్ట్రాన్ని ప్రజలు తనకు అప్పజెప్పారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం ఐదేళ్లు ఎంతగానో కష్టపడ్డానని స్పష్టంచేశారు. గురువారం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం రాష్ట్రంలో ప్రచారానికి పుల్ స్టాప్ పడింది. ఈ సందర్భంగా ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. విభజన నాటి నుంచి నేటి వరకు నెలకొన్న కష్టనష్టాల్ని అందులో ఏకరువు పెట్టారు.
విభజన హామీలు నెరవేరుస్తానని చెప్పి కేంద్రం మోసం చేసిందని.. ఉమ్మడి రాష్ట్ర వాటాలో మన వాటా ఇవ్వకుండా తెలంగాణ అడ్డం తిరిగిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో స్వశక్తిని నమ్ముకుని ముందుకు నడిచినట్టు చెప్పారు. పాదయాత్రలో పేదల కష్టాలు చూశానని, ఆపన్నులందరికీ సంక్షేమం అందించేందుకు రోజుకు 18 గంటలపాటు కష్టపడి సంపద సృష్టించినట్టు వివరించారు. పేదల కష్టాలు తెలిసిన పెద్ద కొడుకుగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే తన కుటుంబ సభ్యులంతా సంతోషంగా జీవించేందుకు రుణమాఫీ, పింఛన్లు, పసుపు-కుంకుమ, నిరుద్యోగ భృతి, పెళ్లికానుక, చంద్రన్న బీమా వంటి పథకాలు తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు.
రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చానని, గత ఐదేళ్లలో రెండు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, రాబోయే ఐదేళ్లలో 15 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ముందుకెళ్తున్నానని చంద్రబాబు తెలిపారు. గత ఐదేళ్లలో రాష్ట్రానికి బంగారు భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకున్నామని, వాటిపై పెట్టుబడులకు గమ్యస్థానంగా నిలిచే భవిష్యత్తు సౌధాలు నిర్మించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఎన్నో బాలారిష్టాలు, కుట్రలు ఎదుర్కొని ఇప్పుడిప్పుడే ఎదుగుతోందని, అలాంటి పసికందును ఆర్థిక నేరగాళ్ల చేతిలో పెట్టగలమా అని ప్రశ్నించారు. 31 కేసులు ఎదుర్కొంటూ 16 నెలలు జైలులో ఉన్న వ్యక్తికి ఈ బిడ్డను అప్పచెప్పి ఆ పసికందు భవిష్యత్తును చిదిమేద్దామా అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు ఓ కథను ప్రస్తావించారు. ‘‘ఒకసారి అడవిలో నాయకత్వానికి సెలయేరు, గొడ్డలి పోటీ పడ్డాయట. అందరి సంక్షేమాన్ని చూసే సెలయేరు కావాలా? చెట్లన్నీ అడ్డంగా నరికే గొడ్డలి కావాలా? అనే మీమాంస ఏర్పడిందట. కొన్ని చెట్లు గొడ్డలి కర్రది మన కులం కదా.. నాయకుడిగా పెట్టుకుంటే తప్పేంటి అనుకున్నాయట. ఆ చెట్ల మాటలను మరో చెట్టు మీద నుంచి ఆసక్తిగా వింటున్న కుందేలు మధ్యలో కలగజేసుని ఇలా అందట.. మన మధ్య ఏ భేదం చూపకుండా అందరి సంక్షేమమే తన కులం అని భావించి సేవచేసే సెలయేటిని వదిలి.. అడ్డంగా నరికే గొడ్డలి కర్రను మీ కులమని ఓటేస్తే చెట్లన్నింటినీ నరికేసి చివరికి అడవి అంతరించిపోతే మన భవిష్యత్తు ఏం కాను? అని అందట. దాంతో అడవిలో చెట్లన్నింటికీ జ్ఞానోదయమై చెట్లన్నీ పచ్చగా ఉండాలంటే మన నాయకుడిగా సెలయేరు ఉండాలని ఎన్నుకున్నాయట. అడవిలో చెట్లన్నింటికీ బాధ్యతను గుర్తు చేసిన ఆ కుందేలు మాటలు మన అందరికీ ఆదర్శం కావాలి’’ అని లేఖలో బాబు పేర్కొన్నారు.
40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ప్రజలే ప్రాణంగా బతికానని, రాష్ట్ర అభివృద్ధి కోసం దేశాలు కాళ్లరిగేలా తిరిగానని వెల్లడించారు. గతంలో తన ట్రాక్ రికార్డు మీరు చూశారని, హైదరాబాద్ ను ప్రపంచ పటంలో ప్రస్ఫుటంగా కనిపించేలా అభివృద్ధి చేసింది తానేనని చెప్పారు. పార్టీలో, ప్రభుత్వంలో అక్కడక్కడా పొరపాట్లు జరిగి, కొంతమంది ఇబ్బంది పడినా పట్టించుకోవద్దన్నారు. 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లలో తానే అభ్యర్థినని భావించి ఓట్లు వేయాలని కోరారు. భవిష్యత్తులో మీకు ఎలాంటి కష్టం లేకుండా చూసుకునే బాధ్యత తనదని చంద్రబాబు స్పష్టంచేశారు. అవినీతిపరులు, అరాచకవాదులకు అధికారం అప్పగిస్తే రాష్ట్రం నాశనమైపోతుందని హెచ్చరించారు. అలాంటివారిని మీ ఓటుతో బుద్ది చెప్పి, తరిమేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేయడం కోసం తనకు అండగా నిలవాలని కోరారు.
289553 812066Hey! Excellent stuff, please maintain us posted when you post something like that! 175872
428792 493319Beging with the entire wales well before just about any planking. Our own wales can easily compilation of calculated forums those thickness analysts could be the similar to some with the shell planking along with far more significant damage so that they project soon after dark planking. planking 82341
920140 547232Youre so cool! I dont suppose Ive read anything like this before. So good to search out any individual with some original thoughts on this topic. realy thank you for starting this up. this site is one thing thats wanted on the web, somebody with a bit of originality. helpful job for bringing something new towards the internet! 293463