తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిపై కలెక్షన్ కింగ్, వైఎస్సార్ సీపీ నేత మోహన్ బాబు సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబుది వాడుకుని వదిలేసే విధానమని నిప్పులు చెరిగారు. తనను నమ్మినవారందరినీ మోసం చేయడం ఆయన నైజమని తూర్పారబట్టారు. స్వర్గీయ ఎన్టీఆర్ సహా ఎంతోమందిని బాబు నిలువునా మోసం చేశారని దుయ్యబట్టారు. బాబుని నమ్మినందుకు తనను కూడా మోసగించారని, అదో పెద్ద చరిత్ర అని మోహన్ బాబు తెలిపారు.
వాస్తవానికి హెరిటేజ్ సంస్థ చంద్రబాబుది కాదని, తన సంస్థను ఆయన మోసపూరితంగా లాక్కున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను హీరోగా మంచి పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు చంద్రబాబు, దాగా అనే మరో స్నేహితుడితో కలిసి హెరిటేజ్ సంస్థ స్థాపించానని మోహన్ బాబు వివరించారు. అందరికంటే తనదే ఎక్కువ శాతం వాటా కాగా, చంద్రబాబుది కాస్త తక్కువ పెట్టుబడి అని, దాగాది ఇంకా తక్కువ పెట్టుబడి అని పేర్కొన్నారు.
సంస్థ స్థాపించిన కొన్నాళ్ల తర్వాత చంద్రబాబు తనచేత కొన్ని ఖాళీ పత్రాలపై సంతకాలు తీసుకున్నారని ఆరోపించారు. అప్పట్లో తాను హీరోగా చాలా బిజీగా ఉన్నందున, ఇవేవీ అంతగా పట్టించుకునేవాడిని కాదని, చంద్రబాబు స్నేహితుడే కదా అని నమ్మి ఖాళీ పేపర్లపై సంతకాలు చేశానని, వాటిని ఉపయోగించుకుని హెరిటేజ్ ను సొంతం చేసుకున్నారని ఆరోపణలు చేశారు. ‘ఖాళీ పత్రాలపై సంతకాలు చేసిన తర్వాత హెరిటేజ్ సంస్థతో నీకు సంబంధం లేదని చెప్పడంతో దిగ్భ్రాంతికి గురయ్యాను.
నాకు అన్యాయం జరగడంతో కోర్టుకు కూడా వెళ్లాను. ఆ కేసు చాలాకాలం కొనసాగింది. అయితే, బాబు రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తి కావడం వల్ల ఆయనతో పెట్టుకుంటే మనం గెలవలేమని నా సన్నిహితులు చెప్పడంతో కేసు వదిలేశాను. హెరిటేజ్ లో పెట్టుబడి పెట్టిన దాగాను కూడా ఇదే రీతిలో మోసం చేసి బయటకు పంపేశారు’ అని మోహన్ బాబు వివరించారు. హెరిటేజ్ వ్యవహారంలో చంద్రబాబు తనను, తన స్నేహితుడినే కాకుండా రైతులను కూడా మోసం చేశారని దుయ్యబట్టారు.
తొలుత కంపెనీ డబ్బును ఖర్చుల కోసమని చెప్పి బ్యాంకు నుంచి డ్రా చేసి, ఆ సొమ్మును తనకు తెలిసిన కొంతమంది రైతులకు ఇచ్చేవారని, తద్వారా వారి పేర్లతో హెరిటేజ్ షేర్లు కొన్నట్టు రికార్డులు సృష్టించేవారని వివరించారు. కొన్నాళ్లకు ఆ షేర్లను తాను కొనుగోలు చేసినట్టుగా చంద్రబాబు పత్రాల్లో చూపించేవారని, ఈ విషయాలేవీ ఆ రైతులకు కూడా తెలియవని, చంద్రబాబు వ్యవహారం అలా ఉంటుందని పేర్కొన్నారు.
కేవలం పన్నులు తప్పించుకోవడం కోసమే అలా చేసేవారన్నారు. తనను మోసం చేసి హెరిటేజ్ సంస్థను తీసుకున్న చంద్రబాబు.. దాన్ని భారీ మొత్తానికి అమ్ముకుని సొమ్ము చేసుకున్నారని మోహన్ బాబు ధ్వజమెత్తారు. తాను చెప్పిన విషయం పూర్తిగా సత్యమని, ఈ విషయంలో తిరుపతి, కాణిపాకం లేదా విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో గానీ కుటుంబ సభ్యులతో వచ్చి ఒట్టేసి చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టంచేశారు. మరి చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో వచ్చి అలా చెప్పగలరా? అని సవాల్ చేశారు.
ఇప్పటికే ఫీజు రీయింబర్స్ మెంట్ వ్యవహారంలో చంద్రబాబుపై ధ్వజమెత్తిన మోహన్ బాబు తాజాగా హెరిటేజ్ కంపెనీపై వెల్లడించిన అంశాలు సంచలనం సృష్టిస్తున్నాయి. మరి చంద్రబాబు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.
675220 586136This really is such a fantastic post, and was thinking significantly the same myself. One more great update. 409949
991854 43995I discovered your weblog internet site internet website on the internet and appearance some of your early posts. Continue to maintain inside the excellent operate. I just now additional increase your Rss to my MSN News Reader. Seeking toward reading far much more from you discovering out at a later date! 856153
596677 721652Would enjoy to perpetually get updated wonderful blog ! . 218191
979355 604165Often the Are normally Weight reduction program is unquestionably an low-priced and flexible weight-reduction program product modeled on individuals seeking out shed some pounds combined with at some point sustain a far healthier your life. la weight loss 509655
760186 551040Wow, fantastic weblog layout! How long have you ever been blogging for? 297749
353152 635879I conceive this internet site has very wonderful indited content material material posts . 496237