Switch to English

ఏపీ సీఎం పవనే: మాయావతి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రి పవన్ కల్యాణే అని బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతి ధీమా వ్యక్తంచేశారు. ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్న విషయం స్పష్టంగా అర్థమవుతోందని, ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో తమ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఆమె ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన, బీఎస్పీ, సీపీఐ, సీపీఎంలు కూటమిగా కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల ఎన్నికల ప్రచారం నిమిత్తం బుధవారం ఉదయం మాయావతి విశాఖపట్నం చేరుకున్నారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆమెకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం అందుకున్నారు. వీరిద్దరూ కలిసి బుధ, గురువారాల్లో తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు.

మధ్యాహ్నం విజయవాడలో జరిగే సభలో, గురువారం తిరుపతి, హైదరాబాద్ లలో నిర్వహించే సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. కాగా, విశాఖ చేరుకున్న అనంతరం పవన్ తో కలిసి మయావతి విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని స్పష్టంచేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలాకాలం కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ, అభివృద్ధి జరగలేదని విమర్శించారు.

అందువల్లే తెలంగాణ ఉద్యమం వచ్చిందని, రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు తగిన న్యాయం జరగలేదని మయావతి అభిప్రాయపడ్డారు. విభజన సందర్భంగా ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రధాని నరేంద్ర మోదీ విఫలమయ్యారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేశారని ఆరోపించారు.

ఈ పరిస్థితుల్లో రాష్ట్రం అభివృద్ది చెందాలంటే కొత్త నాయకత్వం అవసరమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొత్త నాయకత్వాన్ని ఆదరించాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ అధినేత చంద్రబాబు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వలలో పడొద్దని ప్రజలకు సూచించారు. పవన్ వంటి యువ నాయకుడు సీఎం అయితే, ప్రజలకు మంచి జరుగుతుందని మయావతి పేర్కొన్నారు.

ఈ ఎన్నికల్లో తమ కూటమికి ప్రజలు మద్దతు ఉంటుందని భావిస్తున్నట్టు చెప్పారు. అసెంబ్లీతోపాటు లోక్ సభ ఎన్నికల్లోనూ తమ కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి గెలుపొంది, పవన్ సీఎం అవుతారని ఆమె జోస్యం చెప్పారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తన హామీలను నెరవేర్చకపోవడంతో ఆ పార్టీని ప్రజలు ఓడించారని మయావతి పేర్కొన్నారు.

ప్రజలు ఆ ఎన్నికల్లో మార్పు కోసం బీజేపీకి పట్టం కట్టారని, కానీ ఆ పార్టీ కూడా కాంగ్రెస్ బాటలోనే పయనించిందని విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికల్లో ఆ రెండు పార్టీలను పాతాళంలోకి పాతిపెట్టేందుకు ప్రజల్లో నిశ్శబ్ద విప్లవం బయలుదేరిందని పేర్కొన్నారు. బీఎస్పీ నేతృత్వంలోని కూటమి ఈసారి కేంద్రంలో అధికారంలోకి రావడం తథ్యమని ఆమె ధీమా వ్యక్తంచేశారు.

తాము అధికారంలోకి వస్తే ఏ రాష్ట్రం మీదా వివక్ష చూపించబోమని స్పష్టంచేశారు. కాగా, బీఎస్పీ అధినేత్రి మాయావతిని ప్రధానిగా చూడాలన్నది తన కల అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఛాయ్ వాలా ప్రధాని కాగా లేనిది, మాయావతి ప్రధాని కావడంలో తప్పేం ఉందని ప్రశ్నించారు. ఒంటరి మహిళగా ఆమె ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పనిచేస్తుండటం తనకు ఆనందంగా ఉందని పవన్ పేర్కొన్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...