ఆంధ్రప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రి పవన్ కల్యాణే అని బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతి ధీమా వ్యక్తంచేశారు. ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్న విషయం స్పష్టంగా అర్థమవుతోందని, ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో తమ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఆమె ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన, బీఎస్పీ, సీపీఐ, సీపీఎంలు కూటమిగా కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల ఎన్నికల ప్రచారం నిమిత్తం బుధవారం ఉదయం మాయావతి విశాఖపట్నం చేరుకున్నారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆమెకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం అందుకున్నారు. వీరిద్దరూ కలిసి బుధ, గురువారాల్లో తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు.
మధ్యాహ్నం విజయవాడలో జరిగే సభలో, గురువారం తిరుపతి, హైదరాబాద్ లలో నిర్వహించే సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. కాగా, విశాఖ చేరుకున్న అనంతరం పవన్ తో కలిసి మయావతి విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని స్పష్టంచేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలాకాలం కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ, అభివృద్ధి జరగలేదని విమర్శించారు.
అందువల్లే తెలంగాణ ఉద్యమం వచ్చిందని, రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు తగిన న్యాయం జరగలేదని మయావతి అభిప్రాయపడ్డారు. విభజన సందర్భంగా ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రధాని నరేంద్ర మోదీ విఫలమయ్యారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేశారని ఆరోపించారు.
ఈ పరిస్థితుల్లో రాష్ట్రం అభివృద్ది చెందాలంటే కొత్త నాయకత్వం అవసరమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొత్త నాయకత్వాన్ని ఆదరించాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ అధినేత చంద్రబాబు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వలలో పడొద్దని ప్రజలకు సూచించారు. పవన్ వంటి యువ నాయకుడు సీఎం అయితే, ప్రజలకు మంచి జరుగుతుందని మయావతి పేర్కొన్నారు.
ఈ ఎన్నికల్లో తమ కూటమికి ప్రజలు మద్దతు ఉంటుందని భావిస్తున్నట్టు చెప్పారు. అసెంబ్లీతోపాటు లోక్ సభ ఎన్నికల్లోనూ తమ కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి గెలుపొంది, పవన్ సీఎం అవుతారని ఆమె జోస్యం చెప్పారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తన హామీలను నెరవేర్చకపోవడంతో ఆ పార్టీని ప్రజలు ఓడించారని మయావతి పేర్కొన్నారు.
ప్రజలు ఆ ఎన్నికల్లో మార్పు కోసం బీజేపీకి పట్టం కట్టారని, కానీ ఆ పార్టీ కూడా కాంగ్రెస్ బాటలోనే పయనించిందని విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికల్లో ఆ రెండు పార్టీలను పాతాళంలోకి పాతిపెట్టేందుకు ప్రజల్లో నిశ్శబ్ద విప్లవం బయలుదేరిందని పేర్కొన్నారు. బీఎస్పీ నేతృత్వంలోని కూటమి ఈసారి కేంద్రంలో అధికారంలోకి రావడం తథ్యమని ఆమె ధీమా వ్యక్తంచేశారు.
తాము అధికారంలోకి వస్తే ఏ రాష్ట్రం మీదా వివక్ష చూపించబోమని స్పష్టంచేశారు. కాగా, బీఎస్పీ అధినేత్రి మాయావతిని ప్రధానిగా చూడాలన్నది తన కల అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఛాయ్ వాలా ప్రధాని కాగా లేనిది, మాయావతి ప్రధాని కావడంలో తప్పేం ఉందని ప్రశ్నించారు. ఒంటరి మహిళగా ఆమె ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పనిచేస్తుండటం తనకు ఆనందంగా ఉందని పవన్ పేర్కొన్నారు.
994020 403335Some really select articles on this internet site , bookmarked . 538967
651819 760228If you happen to excited about eco items, sometimes be tough shock to anyone them recognise that to help make unique baskets just for this quite liquids carry basic steps liters associated ceiling fan oil producing. dc totally free mommy blog giveaways family trip home gardening residence power wash baby laundry detergent 372323
815279 925560extremely good post, i undoubtedly enjoy this amazing site, persist with it 624803