ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబు కోవిడ్ టీకా రెండో డోసు వేయించుకున్నారు. ఈ మేరకు తాను కోవాగ్జిన్ రెండో డోసు తీసుకున్నట్టు ఆయన ట్విట్టర్ ద్వారా ఆదివారం వెల్లడించారు. గతనెలలో తిరుపతిలో టీకా మొదటి డోసు తీసుకున్న మోహన్ బాబు.. ఆదివారం రెండో డోసు వేయించుకున్నారు. కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తున్న తరుణంలో సినీ, రాజకీయ ప్రముఖులు టీకాలు వేయించుకుంటున్న సంగతి తెలిసిందే.
టీకాలపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు వారంతా టీకాలు వేయించుకుని ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే గతనెలలో మొదటి డోసు వేయించుకున్న మోహన్ బాబు తాజాగా రెండో డోసు కూడా తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని.. ఇంటి నుంచి బయటకు వెళ్లే ప్రతిసారీ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని ఆయన సూచించారు.
698503 921715Would adore to constantly get updated fantastic web weblog ! . 806729
89500 191711Thank you for your extremely good data and feedback from you. car dealers san jose 699963