రాజధాని అమరావతి విషయంలో నానా రచ్చా జరుగుతోంది. హైకోర్టులో కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. వికేంద్రీకరణ విషయమై జరుగుతున్న రచ్చకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఓ ప్రముఖ న్యాయవాదికి అక్షరాలా 5 కోట్ల రూపాయల ఫీజు చెల్లిస్తోన్న విషయం విదితమే. ఈ మేరకు జీవో కూడా విడుదలయ్యింది. కోటి రూపాయల్ని అడ్వాన్స్గా కూడా ఇచ్చేశారు.
మరోపక్క, అమరావతి విషయంలో రైతులూ పట్టుదలగానే వున్నారు. వారి తరఫున వాదనలు విన్పిస్తోన్న న్యాయవాదికి ఎంత చెల్లిస్తున్నారో తెలుసా.? అక్షరాలా కోటి రూపాయలకు పైమాటే.. ఇది కేవలం మూడు రోజులకి మాత్రమేనట. కోర్టులోకి ఒక్కసారి కేసు వెళ్ళిందంటే, ఆ కేసులో తీర్పు ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి.
ఇప్పుడే ఇలా వుంటే, ముందు ముందు ఈ కేసుల వాదనల కోసం ఖర్చులు ఇంకెంతగా పెరిగిపోతాయో. రైతులు చేస్తున్న ఖర్చు అయినా, ప్రభుత్వం చేసే ఖర్చు అయినా.. అదంతా ప్రజలకు సంబంధించిన సొమ్మే. అంటే, అది రాష్ట్రానికి సంబంధించినది. చిత్రమేంటంటే, ఈ సొమ్ముని పట్టుకుపోతున్నది వేరే రాష్ట్రాలకు చెందిన ప్రముఖ న్యాయవాదులు.
పిట్టపోరు.. పిల్లి తీర్చిందనే సామెత ఒకటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అలాగే తయారయ్యింది. వికేంద్రీకరణ పేరుతో.. రాజధాని అమరావతి నుంచి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ని విశాఖకు తరలించాలనుకున్నప్పుడు, అంతకు ముందు అమరావతి కోసం రైతుల నుంచి భూములు సమీకరించే క్రమంలో జరిగిన ఒప్పందాలపై ప్రభుత్వం.. ఆ రైతులతోనే చర్చించాల్సి వుంది. అలా జరగకపోవడమే అన్ని సమస్యలకీ మూల కారణం.
ఐదు కోట్లేం ఖర్మ.. ఐదు వందల కోట్లు ఖర్చయినా ఫర్లేదు తన పంతమే నెగ్గాలనుకుంటున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అవును మరి, అది ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చయ్యే సొమ్ము. అదే సొంత ఖర్చులతో తన సొంత నిర్ణయాన్ని బలపర్చుకుంటే ఆయనకు ఆ నొప్పి తెలిసేది.
572403 723163Spot lets start on this write-up, I seriously believe this remarkable website requirements much far more consideration. Ill a lot more likely once once again to read a terrific deal much more, several thanks that information. 815815
391073 141685Thank you for your very good info and feedback from you. car dealers san jose 783908
867643 161996Thanks so much for an additional post. I be able to get that kind of information info. friend, and exactly. 583714