Kriti Sanon : అల్లు అర్జున్ కి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు అనడంలో సందేహం లేదు. పుష్ప సినిమాకి ముందు నుంచే బాలీవుడ్ ప్రేక్షకుల్లో బుల్లి తెర ద్వార స్థానం దక్కించుకున్న విషయం తెల్సిందే. పుష్ప తో అక్కడ అభిమాన సంఘాలే ఏర్పాటు అయ్యే రేంజ్ లో ఫ్యాన్స్ అయ్యారు.
సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాకుండా బాలీవుడ్ స్టార్స్ కూడా అల్లు అర్జున్ కి అభిమానులు అయ్యారు. తాజాగా స్టార్ హీరోయిన్ కృతి సనన్ ఆసక్తిక వ్యాఖ్యలు చేసింది. అల్లు అర్జున్ తో సినిమాను చేయడం కోసం తాను చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ పేర్కొంది.
జాతీయ అవార్డు తీసుకున్న సమయంలో అల్లు అర్జున్ ను మొదటి సారి చూసి మాట్లాడటం జరిగింది. ఆ సమయంలో ఆయన మాట్లాడిన మాటలు నన్ను ఆశ్చర్యపరిచాయి. ఒక మేధావి మాదిరిగా ఆయన మాటలు ఉన్నాయి. ఆయనతో సినిమాకు ఏ దర్శకుడు ముందుకు వచ్చినా నేను రెడీ అన్నట్లుగా బన్నీతో సినిమా కోసం వెయిట్ అంటూ వ్యాఖ్యలు చేసింది. మరి బన్నీ నుంచి ఈమెకు పిలుపు వచ్చేనా చూడాలి.