అమ్మాయికి మంచి సంబంధం.. ప్రభుత్వ ఉద్యోగం ఉన్న అబ్బాయి అనగానే ఏ తల్లిదండ్రులు అయినా ఆశ పడతారు. తమ అమ్మాయికి మంచి సంబంధం వస్తే వెంటనే పెళ్లి చేయాలనుకునే తల్లిదండ్రులను పట్టుకుని వారిని మోసం చేస్తూ లక్షలు లాగుతున్న కిలాడీ లేడీ పంతంగి మహేశ్వరి అలియాస్ ధరణి రెడ్డి వ్యవహారం అందరికి షాకింగ్ గా ఉంది. ఆమె చెప్పిన మాయ మాటలతో అమ్మాయి తల్లిదండ్రులు ఏకంగా ఏడు లక్షల వరకు మోస పోయారు. ఈ విషయం ప్రస్తుతం పోలీసులు ఎంక్వౌరీ చేస్తూ ఉండగా ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
మహేశ్వరి తో పాటు కృష్ణ హర్ష మరియు కొందరు ఈ వ్యవహారంలో ఉన్నారు. పెళ్లి కొడుకుగా కృష్ణ హర్షను చూపించి మహేశ్వరి మోసాలకు పాల్పడుతుంది. కృష్ణ హర్ష తన ఫొటోలను పంపిస్తూ ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్నట్లుగా చెబుతున్నాడు. మొదట పెళ్లి నిశ్చయించుకుందాం డైరెక్ట్ గా నిశ్చితార్థం చేసుకుందాం లక్ష రూపాయలు కట్నంగా అడ్వాన్స్ ఇవ్వండి అంటూ వసూళ్లు చేసింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు చనిపోవడం వల్ల నిశ్చితార్థం వాయిదా వేస్తున్నాం అన్నారు. ఆ తర్వాత మళ్లీ నిశ్చితార్థంకు బంగారం తీసుకోవాలంటూ డబ్బు వసూళ్లు చేసింది. ఇలా మొత్తంగా 5 లక్షలను ఆమె వసూళ్లు చేసింది. ఇదే సమయంలో అమ్మాయి తరపు వ్యక్తి ఆసుపత్రిలో ఉండగా ఆమె సాయం చేస్తానంటూ మరో రెండు లక్షలు లాగింది. మొత్తంగా పెళ్లి పేరు చెప్పి ఏకంగా 7 లక్షల రూపాయలను మహేశ్వరి లాగినట్లుగా బాధితులు చెబుతున్నారు.
950253 404776You ought to join in a contest for starters of the highest quality blogs online. I will recommend this page! 87813
973315 456334I see something actually fascinating about your web website so I saved to bookmarks . 392455
935317 48055This article is very appealing to thinking individuals like me. Its not only thought-provoking, it draws you in from the beginning. This really is well-written content material. The views here are also appealing to me. Thank you. 608375