‘జార్కిహోళి పేరు రాసిపెట్టి చనిపోవాలని ఉంది. నాపై ఒత్తిడి తెస్తున్నారు. నా తల్లిదండ్రులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. బయటకు వచ్చి ఏమైనా చెప్పాలంటే భయమేస్తోంది. సీఎం యడియూరప్ప, హోంమంత్రి, కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ భరోసా ఇవ్వాలి. న్యాయమూర్తి ముందు మొత్తం చెప్పేస్తా. నాకు తగిన అవకాశం కల్పించండి’ అని కర్ణాటక సీడీ వ్యవహారంలో యువతి విడుదల చేసిన వీడియోలో పేర్కొనడం సంచలనం రేపుతోంది.
దీనిపై శనివారం నాటకీయ పరిణామాలు జరిగాయి. తన కుమార్తెను నీచ రాజకీయాలకు బలి చేస్తున్నారని ఆమె తల్లిదండ్రులు వాపోయారు. సైనికుడిగా దేశాన్నే కాపాడుకున్నవాడ్ని.. నా కుమార్తెను కాపాడుకోలేనా? అని యువతి తండ్రి అంటున్నారు. మరోవైపు యువతి తల్లిదండ్రులుచ పోదరులను సిట్ ప్రశ్నించింది. ఈ మొత్తం వ్యవహారం వెనుక సూత్రదారి మహానాయకుడు డీకే శివకుమార్ అని జర్కిహోళి ఆరోపించారు. అయితే రాత్రికి తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నానన్నారు. బీజేపీ కుట్రలకు తాను భయపడనని శివకుమార్ ఈ సందర్భంగా అన్నారు.
918685 464876forty men and women that work with all the services Oasis provides, and he can be a very busy man, he 521920