తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. దసరా సెలవులు ముగియడంతో, రాజకీయ సభల జోరు పెరిగింది. ముఖ్యమంత్రి కేసీయార్, మెరుపు పర్యటనలు చేస్తున్నారు.. తెలంగాణ ఉద్యమ పార్టీ అయిన గులాబీ పార్టీకే ఓటెయ్యాలంటున్నారు.
మరోపక్క, కాంగ్రెస్ పార్టీ ఒకింత బలం పుంజుకుంటున్నట్లే కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి సీనియర్లు వస్తున్నారు. బీజేపీ పరిస్థితే అగమ్యగోచరంగా తయారైంది. అందుకేనేమో, జనసేన పార్టీని దగ్గర చేసుకుంటోంది బీజేపీ అగ్రనాయకత్వం. తెలంగాణ బీజేపీ, హుటాహుటిన పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యిందంటే, బీజేపీ అగ్రనాయకత్వం ఆదేశాలతోనే.
అయితే, కేంద్ర హోంమంత్రి అమిత్ షాని పవన్ కళ్యాణ్ కలిశాక, అమిత్ షా నుంచి వచ్చిన ట్వీట్ అందర్నీ విస్మయానికి గురిచేసింది. ‘ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి జనసేనానితో చర్చించడం జరిగింది’ అన్నది ఆ ట్వీట్ సారాంశం. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఢిల్లీకి తీసుకెళ్ళి, అమిత్ షాతో భేటీ అయ్యేలా చేస్తే.. అమిత్ షా, ఏపీ రాజకీయాల గురించి మాట్లాడమేంటి మరి.? లాజిక్కే కదా.!
తెలంగాణలో బీజేపీకి మద్దతివ్వాలంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి కాస్త సీరియస్గా ఆలోచించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ అగ్రనాయకత్వానికి తేల్చి చెప్పారు. అదీ అసలు సంగతి.
ఇక, తెలంగాణలో జనసేన ఓటర్లు ఖచ్చితమైన అభిప్రాయంతోనే వున్నారు. ఏపీలో బీజేపీ గనుక జనసేనకు సహకరిస్తే సరే సరి.. లేదంటే, తెలంగాణలో గులాబీ పార్టీకే ఓటెయ్యాలన్న ఆలోచనలో జనసేన ఓటర్లు వున్నట్లు కనిపిస్తోంది. జనసేన పోటీ చేసే నియోజకవర్గాల్లో జనసేనకీ, జనసేన పోటీ చేయని నియోజకవర్గాల్లో గులాబీ పార్టీకీ, కుదిరితే కాంగ్రెస్ పార్టీకైనా వేయొచ్చన్న ఆలోచనలో ఆ ఓటర్లు వున్నారట.
ఈ విషయాన్ని కొందరు జనసేన మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగానే కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియా వేదికగానూ చెబుతున్నారు.
Keep on writing, great job!