సర్టిఫికెట్లపైనే విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని.. అందువల్లే రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తామని స్పష్టంచేశారు. రాష్ట్రంలో జగనన్న వసతి దీవెన తొలి విడత సాయాన్ని ఆయన బుధవారం విడుదల చేశారు. 10.89 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.1049 కోట్లు జమచేశారు. పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ ఆపై కోర్సులు చదివే విద్యార్థుల వసతి, ఆహార ఖర్చుల కోసం ఈ పథకం కింద ఆర్థికసాయం చేశారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. పది, ఇంటర్ పరీక్షల నిర్వహణపై పలువురు విమర్శలు చేస్తున్నారని, విపత్కర సమయంలోనూ అగ్గి పెట్టాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. పరీక్షలు నిర్వహించాలో వద్దో కేంద్రం రాష్ట్రాలకే వదిలేసిందని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణ అన్ని రాష్ట్రాల్లో ఒకేలా లేదన్నారు. పరీక్షలు నిర్వహించకపోతే సర్టిఫెకెట్లలో పాస్ అనే ఉంటుందని.. పాస్ సర్టిఫికెట్లతో విద్యార్థులకు మంచి సంస్థల్లో సీట్లు వస్తాయా అని ప్రశ్నించారు. విద్యార్థులకు ఉన్నత భవిష్యత్ ఉండాలనే పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఏ విద్యార్థికీ నష్టం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.
99721 198368Great post. I previousally to spend alot of my time water skiing and watching sports. It was quite possible the top sequence of my past and your content material kind of reminded me of that period of my life. Cheers 833502