మనకన్నా సైనిక బలంలో చాలా తక్కువ అయిన పాకిస్తాన్ విషయంలోనే ఆచి తూచి వ్యవహరించాల్సి వస్తోంది. మరి, మనకంటే సైనిక బలం చాలా ఎక్కువ వున్న చైనాతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే.? ఈ ప్రశ్న ఇప్పుడు మొత్తం 130 కోట్ల మందిని ఆందోళనకు గురిచేస్తోంది. ‘మేరా భారత్ మహాన్..’ అంటూ దేశం కోసం రక్తం చిందించడానికి దేశ ప్రజానీకం ఎప్పుడూ సిద్ధంగానే వుంటుంది. అయినాగానీ, యుద్ధం అంత తేలికైన వ్యవహారం కాదు. భారత్తో యుద్ధం చేయాల్సి వస్తే తలెత్తే నష్టాల గురించి చైనా కూడా గట్టిగానే ఆలోచిస్తుంది. కానీ, పాకిస్తాన్ విషయంలో మనం అనుసరిస్తున్న వైఖరిని చూసి, చైనా కయ్యానికి కాలు దువ్వుతోందన్నది నిర్వివాదాంశం.
నిజానికి చైనా ఏనాడూ భారతదేశానికి మిత్రదేశం కాదు. శతృదేశమే. పాకిస్తాన్, చైనాలతో మాత్రమే భారతదేశం ఇప్పటిదాకా పూర్తిస్థాయి యుద్ధాలు చేసింది. పాకిస్తాన్తో పోల్చితే, చైనా నుంచి తీవ్రవాదం ముప్పు భారతదేశానికి లేదు. కానీ, పాకిస్తానీ తీవ్రవాదుల్ని ఎగదోయడంలో పాకిస్తాన్కి చైనా పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందనుకోండి.. అది వేరే విషయం.
ఇప్పుడు వివాదం లడఖ్ సరిహద్దుల్లోని గాల్వాయి లోయ గురించి. అదొక్కటే కాదు, అరుణాచల్ ప్రదేశ్ సహా పలు కీలక ప్రాంతాలపై చైనా కన్నేసింది ఎప్పటినుంచో. ఆయా ప్రాంతాల్లో ఇప్పుడు మరింతగా మనం సైన్యాన్ని మోహరించాల్సి వస్తోంది. ఏ క్షణాన ఎక్కడ ఎలాంటి దాడి చైనా నుంచి జరుగుతుందో తెలియని పరిస్థితి. ‘గాల్వాన్ లోయ మాదే..’ అని చైనా అంటోంది. ‘అరుణాచల్ ప్రదేశ్ కూడా మాదే’ అని ఎప్పటినుంచో అంటోంది. ‘మేం, మా ప్రాంతాల్ని తిరిగి దక్కించుకోవాలంటే.. భారత్తో యుద్ధం చేయక తప్పదు..’ అన్న ధోరణిలో వుంది చైనా. ఈ తరహా కుట్రలు చైనా ఎప్పటినుంచో పన్నుతూనే వుంది. మధ్యలో చిన్న గ్యాప్ అంతే.
అంతర్జాతీయ సమాజంలో చైనాని ఎండగట్టడం అంత తేలిక కాదు. కరోనా వైరస్ విషయంలో అమెరికా ఎంత గొంతు చించుకున్నా చైనాని దోషిగా నిలబెట్టలేకపోయింది. అగ్రరాజ్యానికే అలాంటి పరిస్థితి అంటే, చైనా విషయంలో మన పరిస్థితి ఏంటి.? అయితే, భారత్ తలచుకుంటే ఏం జరుగుతుందో చైనాకి కూడా బాగా తెలుసు. ఓసారి చైనాతో యుద్ధంలో భారత్ ఓడిపోయినా, సరిహద్దుల్లో చైనాకి ఎప్పటికప్పుడు భారత్ ధీటుగానే సమాధానం చెబుతోంది. కొన్నిసార్లు చైనా తోకముడిచింది కూడా. ఏదిఏమైనా, మోడీ సర్కార్కి ఇది అసలు సిసలు అగ్ని పరీక్ష. చైనాతో వివాదాన్ని మోడీ సర్కార్ ఎలా పరిష్కరిస్తుందోగానీ.. ఈ సమయంలో రాజకీయాలకు తావివ్వకుండా వ్యవహరించాల్సిన బాధ్యత మాత్రం అధికారంలో వున్న బీజేపీదే.
ముగ్గురు సైనికులు మాత్రమే చనిపోయారని తొలుత ప్రకటించి, ఆ తర్వాత ఆ సంఖ్యన 20గా చూపిన కేంద్రం, చైనా చెరలో వున్న 10 మంది విషయాన్ని ఆలస్యంగా బయటపెట్టింది. దాదాపు 50 మంది గాయపడ్డ విషయమూ ఆలస్యంగానే వెలుగు చూసింది. ఎలా చూసినా, ఇది చిన్న ఘటన కాదు.. పుల్వామా ఘటనతో పోల్చలేంగానీ, అంతటి తీవ్రత వున్న ఘటనే ఇది.
767454 283490This really is such a great resource that youre offering and you offer out at no cost. I appreciate seeing internet sites that realize the worth of offering a perfect useful resource totally free. I genuinely loved reading your submit. 340710
40854 596263We are a group of volunteers and opening a new system in our community. Your web web site given us with valuable details to function on. Youve done an impressive job and our entire community will be grateful to you. 519640