ప్రధాని దత్తత తీసుకున్న దోమరి గ్రామంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, అక్కడ పేదలకు రేషన్ కార్డులు లేవు, కరోనా విపత్తు సమయంలో వారికి సరైన సాయం అందలేదు. రేషన్ కార్డులు లేని పేదలకు ఆహారం అందించడంలో విఫలం అయ్యారు. రేషన్ కార్డులు ఉన్న వారు సైతం రేషన్ తీసుకునేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది అంటూ దోమరి గ్రామంపై సుప్రియ శర్మ అనే లేడీ జర్నలిస్ట్ సంచలన కథనం ప్రచురించారు. స్క్రోల్ ఇన్ అనే వెబ్ సైట్ లో ఆమె రాసిన కథన పెద్ద చర్చకు దారి తీసింది.
భారత ప్రధాని స్వయంగా దత్తత తీసుకున్న గ్రామంలో ఇలాంటి పరిస్థితులు ఉంటే ఇతర గ్రామాల్లో ఉన్న పరిస్థితుల గురించి ప్రత్యేకంగా మాట్లాడనక్కర్లేదు అంటూ ఆమె తన కథనంలో పేర్కొన్నారు. వ్యాది సంక్రమించకుండా అక్కడ చేపట్టిన చర్యలు జీరో అంటూ ఇంకా ఆ గ్రామం గురించి ఎన్నో విషయాలను సుప్రియ శర్మ పేర్కొన్నారు. ఆ కథనంపై తీవ్రంగా స్పందించిన అధికారులు సుప్రియ శర్మపై కేసులు పెట్టారు. రేషన్ వివరాలపై తప్పుడు కథనాలు రాయడంతో పాటు ఆ గ్రామంలో పలువురితో బలవంతంగా మాట్లాడిచ్చి గ్రామం గురించి అసత్యాలు రాసింది అంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.
మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసికి చెందిన గ్రామం అవ్వడంతో దోమరి గురించి అందరికి కూడా ఆసక్తి ఉంది. అలాంటి గ్రామంపై సుప్రియ శర్మ ప్రచురించిన కథనం ఏకంగా ప్రధాని మోదీని అవమానించినట్లుగా ఉంది. అందుకే ఆమెపై అధికారులు కేసు నమోదు చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మరియు విపక్షాలు సుప్రియ శర్మకు మద్దతుగా నిలుస్తున్నాయి. ఆమెపై కక్ష సాధించడం ఏమాత్రం సరైన పద్దతి కాదంటూ వారు ప్రభుత్వ వర్గాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించాల్సిందే అంటూ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
890431 756535I gotta favorite this website it seems handy extremely valuable 48241
982378 174888I really like reading by means of and I think this web site got some genuinely utilitarian stuff on it! . 842016
572777 262177Wow, superb weblog structure! How long have you been blogging for? you make blogging glance effortless. The total appear of your web website is exceptional, neatly as the content material material! 408681
967216 297886I like this post, enjoyed this 1 appreciate it for putting up. 44119