భారత్ చైనా సరిహద్దు గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో భారత్కు చెందిన 20 మంది సైనికులు మృతి చెందిన విషయం తెల్సిందే. ఈ ఘర్షణల్లో చైనాకు చెందిన 35 మంది సైనికులు మృతి చెంది ఉంటారంటూ అమెరికా నిఘా వర్గాల వారు ప్రకటించారు. ఇండియన్ ఆర్మీ కూడా చైనా సైనికుల మృతిని నిర్ధారిస్తున్నాయి. ఇక గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో పది మంది భారత సైనికులు చైనా ఆర్మీకి చిక్కడం జరిగిందట. వారి విడుదలకు రెండు వైపుల సైనిక ఉన్నతాధికారులు చర్చలు జరిపారు.
గురువారం సాయంత్రంకు భారత్కు చెందిన ఆ పది మంది సైనికులను చైనా విడుదల చేసిందని ప్రముఖ మీడియా సంస్థ పేర్కొంది. కాని ఇప్పటి వరకు ఇండియన్ ఆర్మీ మాత్రం చైనా సరిహద్దుల్లో చైనా సైన్యం భారత సైనికులను పట్టుకున్న విషయాన్ని వెళ్లడి చేయలేదు. పీటీఐ మీడియా సంస్థ మాత్రం చైనా నుండి భారత సైనికులు సురక్షితంగా బయట పడ్డట్లుగా కథనంను రాసింది. ఇక మొన్నటి ఘర్షణల్లో భారత్కు చెందిన 76 మంది సైనికులు గాయపడ్డట్లుగా ఆర్మీ పేర్కొంది. వారిలో 18 మందికి తీవ్ర గాయాలు అయినట్లుగా ఇండియన్ ఆర్మీ అధికారికంగా ప్రకటించింది.
745027 953629Hey! Good stuff, do tell us when you post something like that! 375670
776329 121043Hi. Cool post. There is actually a problem with the internet site in firefox, and you may want to test this The browser is the marketplace leader and a huge portion of folks will miss your superb writing due to this difficulty. 960403