మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ డైరెక్షన్ లో చేస్తున్న 152వ ‘ఆచార్య’ సెట్స్ పై ఉంది. కోవిద్ పాండెమిక్ వలన షూటింగ్స్ ఆగిపోయాయి, మళ్ళీ ఎప్పుడు పట్టాలెక్కుతాయో తెలియని పరిస్థితి. ఇది పక్కన పెడితే. ఆచార్య తర్వాత చేయాల్సిన సినిమాలను ఇప్పటికే చిరు లైనప్ చేసాడు. అవే సుజీత్ డైరెక్షన్ లో చేయాలనుకున్న ‘లూసిఫెర్’ రీమేక్, బాబీ మరియు మెహెర్ రమేష్ సినిమాలు.
ఈ లాక్ డౌన్ టైంలో సుజీత్ లూసిఫెర్ రీమేక్ ని తనదైన స్టైల్ లోకి మార్చి మార్పులు చేర్పులు చేసాడు. కానీ తాజాగా మీడియాలో ఈ లూసిఫర్ రీమేక్ కి సుజీత్ ని మార్చి వివి వినాయక్ ని డైరీక్టర్ గా ఎంచుకున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై మాకు అందిన సమాచారం ప్రకారం డైరెక్టర్ మారలేదు కానీ సినిమాల ఆర్డర్ మారేలా ఉంది.
ఇటీవలే బాబీ చిరు కోసం చేస్తున్న కథ దాదాపు పూర్తయిందని తెలిపాము. అందులో భాగంగా బాబీ ఓవరాల్ స్టోరీ పాయింట్, హీరో పాత్రతో కలిపి చెప్పడంతో చిరుకి బాగా నచ్చిందట. త్వరలోనే ఫినిష్ చేసి పూర్తి కథ వినిపించమన్నాడట. ఈ స్టోరీ డీటైల్స్ విన్న తర్వాత చిరు ఆచార్య తర్వాత బాబీ సినిమా చేస్తే బాగుంటుందని, ఆ తర్వాత లూసిఫెర్ రీమేక్ గురించి నిర్ణయం తీసుకుందామనే ఆలోచనలో ఉన్నారట. బాబీ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.
మరి ఇలానే జరిగితే ఆచార్యని ఫినిష్ చేసి, ఆ తర్వాత బాబీ సినిమా చేయడానికి 2021 అంతా సరిపోతుంది. అంటే 2021 చివరి వరకూ లూసిఫెర్ రీమేక్ ప్రస్థావన ఉండకపోవచ్చు. కాబట్టి ఈ లోపు ఆ సినిమా డైరెక్టర్ కూడా మారచ్చు లేదా మళ్ళీ లూసిఫెర్ ప్లేస్ లో ఇంకో సినిమా రావచ్చు. లూసిఫెర్ రీమేక్ విషయంలో ఉన్న మరో సమస్య.. ఇంకో యంగ్ హీరో కావాల్సి రావడం.
193686 330519Sweet internet web site , super style and design , rattling clean and utilize genial . 866010
129256 931783learning toys can enable your kids to develop their motor skills quite easily;; 157029