అహ్మదాబాద్లో నిర్మాణం జరిగిన అతిపెద్ద క్రీడామైదానం సర్దార్ వల్లభాయ్ పటేల్ మొతెరా మైదానంలో వచ్చే ఏడాది క్రికెట్ పండుగ జరుగబోతుంది. వరుసగా రెండు టెస్టు మ్యాచ్ లు మరియు అయిదు టీ20 మ్యాచ్లను అక్కడ నిర్వహించబోతున్నట్లుగా బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఒక్క స్టేడియంలో వరుసగా ఇన్ని టీ20 మ్యాచ్ లు జరగడం అనేది ఇదే ప్రథమంగా చెబుతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్ మరియు టీం ఇండియాల మద్య జరుగబోతున్న మ్యాచ్ లకు ఈ స్టేడియం వేదిక అవ్వబోతుంది.
దాదాపు రెండు నెలల పాటు ఇంగ్లాండ్ జట్లు ఇండియాలో పర్యటించబోతుంది. మొదట టెస్టు సిరీస్ తో వారి పర్యటన ప్రారంభం అవ్వబోతుంది. ఫిబ్రవరి 5న టెస్ట్ సిరీస్ చెన్నైలో జరుగబోతుంది. మార్చి 4వ తారీకున చివరి టెస్టు మ్యాచ్ మొతెరాలో జరుగబోతుంది. ఇక టీ20 సిరీస్ ను మార్చి 12న ప్రారంభించనున్నారు. మార్చి 20న చివరి టీ20 మ్యాచ్ ఉంటుంది. టీ20 మ్యాచ్ లు అన్ని కూడా మొతెరాలో జరుగబోతున్నాయి. వన్డే సిరీస్ మార్చి 23న ప్రారంభం కాబోతుంది. వన్డే సిరీస్ మొత్తం కూడా పుణెలో నిర్వహించనున్నారు. ఇంగ్లాండ్ జట్టు పర్యటన మొత్తం కూడా అహ్మాదాబాద్, చెన్నై మరియు పుణెలో మాత్రమే ఉండబోతుంది. కరోనా కారణంగా ఇలా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.
563574 229059Hello to all I cannot recognize the way to add your site in my rss reader. Assist me, please 576189