ఓపక్క తూర్పు లద్దాఖ్ బలగాల ఉపసంహరణపై భారత్, చైనా ఉన్నతాధికారుల మధ్య తొమ్మిదో విడత చర్చలు జరుగుతుంటే.. చైనా మరోచోట దాస్సాహసానికి పాల్పడింది. సిక్కింలోని నకులా సరిహద్దులో భారత్ భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు పీపుల్స్ లిబరేషన్ బలగాలు ప్రయత్నం చేశాయి. ఈ ప్రయత్నాన్ని భారత భద్రతాదళాలు తిప్పికొట్టాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల సైనికుల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. జనవరి 20న జరిగిన ఆ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దీనిపై భారత సైన్యం స్పందించింది. ఉత్తర సిక్కిం ప్రాంతలో భారత్ – చైనా భద్రతాదళాల మధ్య స్వల్ప ఘర్షణ జరగడం.. పలువురు సైనికులు స్వల్పంగా గాయపడటం జరిగిందన్నారు. స్థానికంగా ఉన్న కమాండర్ల సాయంతో సమస్య పరిష్కారమైందని కూడా అన్నారు. ఈ విషయంపై మరిన్ని అవాస్తవ కథనాకలు ఆస్కారం లేదని అన్నారు. మరోవైపు ఆదివారం భారత-చైనా సైనిక ఉన్నతాధికారుల మధ్య ప్రారంభమైన చర్చలు సోమవారం వరకూ జరిగాయి. బలగాల ఉపసంహరణలో చైనానే వైదొలగాల్సి ఉందని భారత బలగాలు స్పష్టం చేశాయి.
170305 651225Hi. Cool post. Theres an problem with your web site in firefox, and you may want to check this The browser could be the market chief and a great section of individuals will pass more than your excellent writing because of this problem. 892754
499175 912171I like this weblog so a lot, saved to fav. 900025