Chiranjeevi Blood Bank: దేశవ్యాప్తంగా 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ పతాక ఆవిష్కరణ జరిపారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సంస్థల కార్యాలయాల్లో స్వాతంత్ర వేడుకలను నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi)స్థాపించిన ‘చిరంజీవి బ్లడ్ బ్యాంకు’లో స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పాల్గొని.. బ్లడ్ బ్యాంక్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మాధవి రాజు తో కలిసి పతాక ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఈవీసీ శేఖర్, CTC-COO ఆర్ స్వామి నాయుడు పాల్గొన్నారు.
మరోవైపు మెగాస్టార్ చిరంజీవి దేశ ప్రజల ప్రజలకు, మెగా అభిమానులకు, ఆత్మీయులకు సోషల్ మీడియా ద్వారా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.