రాజస్థాన్ భరత్ పూర్లోని అప్నా ఆశ్రమ్ కు శారదదేవి అనే 35 ఏళ్ల మహిళ ఆశ్రయం కోసం వచ్చింది. ఆ సమయంలో ఆమెకు కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. అప్పుడు ఆమెకు కరోనా పాజిటివ్ అంటూ వచ్చింది. దాంతో ఆమెను రెండు వారాల పాటు ఐసోలేషన్ లో ఉంచారు. ఆ తర్వాత ఆమెను మళ్లీ పరీక్షించగా కరోనా పాజిటివ్ అనే వచ్చింది. దాంతో ఆమెను మళ్లీ అలాగే ఐసోలేషన్ లో ఉంచారు. ఆమెకు గత అయిదు నెలల్లో ఇప్పటి వరకు మొత్తం 31 సార్లు కరోనా నిర్థారన పరీక్ష నిర్వహించగా అన్ని సార్లు కూడా పాజిటివ్ అని వచ్చింది.
కరోనా పాజిటివ్ అయినా కూడా ఆమె ఆరోగ్యంగానే కనిపిస్తున్నారు. ఎలాంటి లక్షణాలు లేవు. ఈ అయిదు నెలల కాలంగా మంచి ఆహారం తీసుకోవడంతో పాటు విశ్రాంతి తీసుకుంటున్న కారణంగా ఆమె ఏకంగా 8 కేజీల బరువు పెరిగారు. ఆశ్రమం లో జాయిన్ అయిన సమయలో ఆమె ఉన్న పరిస్థితికి ఇప్పటికి చాలా మార్పు ఉంది. ఆమె చాలా ఆరోగ్యంగా కనిపిస్తున్నారు. అయినా కూడా కరోనా పాజిటివ్ అంటూ ఎందుకు వస్తుందో అర్థం అవ్వడం లేదు అంటూ వైధ్యులు జుట్టు పీక్కుంటున్నారు.
455401 318627The planet are actually secret by having temperate garden which are typically beautiful, rrncluding a jungle that is surely definitely profligate featuring so several systems by way of example the game courses, golf approach and in addition private pools. Hotel reviews 854804
10395 126167Sweet site, super style and style , genuinely clean and use friendly . 42146