మద్యం మత్తులో ముగ్గురు యువకులు ఓ యువకుడిపై అకారణంగా దాడి చేసి కత్తితో పొడిచారు. అనంతరం తాము కొట్టాల్సిన వ్యక్తి అతడు కాదని తెలుసుకుని చికిత్స కోసం రూ.వెయ్యి బాధితుడి చేతిలో పెట్టారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చుక్కపల్లివారి పాలెంకు చెందిన పల్లం ఏసుదాసు కుమారుడు తేజ (18) అమరావతిలోని వాళ్ల పిన్ని ఇంట్లో ఉంటూ ఆర్వీవీఎస్ కాలేజీలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. శనివారం తన దగ్గరకు వచ్చిన తల్లిదండ్రులను తేజ కారులో తీసుకుని వెళ్లి ఇంటి దగ్గర దింపి తిరిగి అమరావతి బయలుదేరాడు.
ఈ క్రమంలో కారు టైరు పంక్చరైంది. దీంతో తేజ కిందకు దిగి టైరును పరిశీలిస్తుండగా.. ఓ యువకుడు వచ్చి తేజను దుర్భాషలాడాడు. కారుతో ఢీకొట్టి ఆపకుండా వెళ్తావా అంటూ దాడి చేశాడు. తేజ తేరుకునేలోపే కత్తితో పొడిచి వెళ్లిపోయాడు. పది నిమిషాల తర్వాత మరో ఇద్దరు యువకులు కూడా అలాగే వచ్చి కర్రలతో తేజపై దాడి చేసి వెళ్లిపోయారు. అయితే, పది నిమిషాల తర్వాత ఆ ముగ్గురు యువకులు మళ్లీ తేజ వద్దకు వచ్చారు.
సారీ బ్రదర్.. వేరేవాడిని కొట్టబోయి నిన్ను కొట్టామని చెప్పి చికిత్సి చేయించుకోవాలంటూ రూ.1000 అతడి చేతిలో పెట్టి వెళ్లిపోయారు. అనంతరం తేజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. సంగడిగుంటకు చెందిన ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. తాగిన మైకంలో వేరే యువకుడిని కొట్టబోయి తేజపై దాడి చేసినట్టు విచారణలో అంగీకరించారు.
490742 463007An really interesting read, I may possibly not agree completely, but you do make some extremely valid points. 47235
267897 482679I discovered your weblog website on google and check a couple of of your early posts. Proceed to sustain up the superb operate. I just additional up your RSS feed to my MSN Data Reader. In search of forward to reading extra from you later on! 775497
926837 115644Im having a small difficulty. Im unable to subscribe to your rss feed for some reason. Im employing google reader by the way. 490180
212728 619314I extremely delighted to uncover this internet site on bing, just what I was seeking for : D besides saved to bookmarks . 781394