ఆర్థిక మాంద్యం.. ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. మాంద్యం వస్తే అన్నీ ఇబ్బందులేనని, ఉద్యోగాలు ఉండవని, ఉపాధి కరువవుతుందని, తీవ్రమైన సంక్షోభ పరిస్థితులు ఏర్పడతాయనే మాటలు వినిపిస్తున్నాయి. అసలు ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి? అది వస్తే సామాన్య జనంపై ఎలాంటి ప్రభావం కనిపిస్తుంది? సింపుల్ గా చెప్పాలంటే.. ఆర్థిక మాంద్యం లేదా ఆర్థిక సంక్షోభం అంటే ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోవడమే.
ఒక వస్తువును ప్రజల కొనలేకపోతున్నారంటే దాని ప్రభావం ఒకరి నుంచి మరొకరికి గొలుసుకట్టు రూపంలో పడుతుందన్నమాట. ఉదాహరణకు.. రవి ఉద్యోగం చేస్తూ నెలకోసారి జీతం తీసుకుంటున్నాడు. అలా తీసుకున్న జీతాన్ని ఇంటి ఖర్చుల కోసం వెచ్చించడంతోపాటు ఇతరత్రా సౌకర్యాలను పొందడానికి ఖర్చు చేస్తున్నాడు. జీతం వచ్చింది కదా అని కుటుంబ సభ్యులతో కలిసి ఓ రెస్టారెంటుకు వెళ్లి రూ.500 ఖర్చు పెట్టి భోజనం చేశాడు. ఆ రెస్టారెంట్ యజమాని తన దగ్గర పనిచేస్తున్న కుర్రాడికి జీతం ఇచ్చాడు. అతడు ఆ డబ్బుతో సాయంత్రం పూట సరదాగా సినిమాకు వెళ్లాడు. సినిమా థియేటర్ యజమాని ఆ సొమ్ముతో తన కుమార్తెకు ఓ బొమ్మ కొన్నాడు. ఆ బొమ్మల షాపు యజమాని తన రుణ వాయిదా చెల్లించాడు. బ్యాంకు ఆ డబ్బుతో మరొకరికి రుణం మంజూరు చేసింది. ఇక్కడ ఉన్నది ఒక్క రూ.500 మాత్రమే. కానీ అది ఒకరి నుంచి మరొకరికి చేతులు మారడం వల్ల ఒక్క రోజులో రూ.3వేల విలువైన లావాదేవీలు జరిపింది. ఇదంతా రవికి తన జీతం సక్రమంగా వచ్చినప్పుడు మాత్రమే జరుగుతుంది.
ఒకవేళ రవికి ఉద్యోగం పోయి, జీతం రాకపోతే.. అతడు రెస్టారెంటుకు వెళ్లి భోజనం చేయడు. దాంతో రెస్టారెంటు కుర్రాడికి జీతం రాదు. అతడు సినిమా చూడలేడు. థియేటర్ యజమాని బొమ్మ కొనలేడు. బొమ్మల షాపు యజమాని రుణ వాయిదా చెల్లించలేడు. బ్యాంకు దివాళా తీస్తుంది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. మాంద్యం మనపై చూపించే ప్రభావం స్థూలంగా ఇలాగే ఉంటుంది.
ప్రస్తుతం దేశంలో ఇదే పరిస్థితి నెలకొంది. ఆర్థిక సంక్షోభం ప్రమాద ఘంటికలు మోగించేసింది. నెమ్మదిగా ఒక్కో రంగానికీ సెగ తాకుతోంది. తొలుత ఆటోమొబైల్ రంగంపై దీని ప్రభావం పడింది. కార్ల అమ్మకాలు బాగా తగ్గిపోయాయి. దీంతో కంపెనీలు కార్ల ఉత్పత్తి ఆపేయడంతోపాటు క్రమంగా ప్లాంట్లను మూసేస్తున్నాయి. ఫలితంగా ఒక్క జూలైలోనే దాదాపు 2.3 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని అంచనా. అలాగే మరో 10 లక్షల మంది ఉద్యోగాలకు సైతం ముప్పు పొంచి ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఆటోమొబైల్ రంగం గతంలో ఎన్నడూ ఇంతటి గడ్డు పరిస్థితి ఎదుర్కోలేదు. కార్ల ఉత్పత్తి తగ్గడంతో అటు స్టీల్, టైర్లు, ఇతరత్రా మెటీరియల్ ఉత్తత్తి సంస్థలపైనా ప్రభావం పడుతోంది. దీంతో అక్కడ కూడా పొదుపు చర్యలు తప్పనిసరి అవుతున్నాయి. ఇక రోజువారీ ఉపయోగించే నూనెలు, ఉప్పు, కారాల వంటి ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) విషయంలోనూ మాంద్యం ప్రభావం కనిపిస్తోంది. ఆయా కంపెనీల వృద్ది రేటు సైతం భారీగా క్షీణించింది.
అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని పరిశీలిస్తే.. కేంద్రం తీసుకున్న విధానాలే ఇందుకు కారణమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి కీలక నిర్ణయాలు మన దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపించాయని చెబుతున్నారు. నోట్ల రద్దు, తదనంతర పరిణామాలతో అసలు బ్యాంకులు అంటేనే భయపడే పరిస్థితికి ప్రజలు రావడం, జీఎస్టీ అమలు వ్యాపారస్తులపై ప్రభావం చూపడం, అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి క్షీణత వంటి అంశాలు మన దేశాన్ని మాంద్యం కోరల్లోకి తీసుకెళ్తున్నాయి.
610211 740347Oh my goodness! an wonderful write-up dude. Several thanks Even so My business is experiencing trouble with ur rss . Do not know why Struggle to sign up to it. Can there be everyone getting identical rss dilemma? Anyone who knows kindly respond. Thnkx 704828