తెలుగు సినిమాల్లో ఒక్కోసారి ఒక్కో హవా నడుస్తుంటుంది. అదే క్రమంలో ఇప్పుడు హిందీ విలన్ల డిమాండ్ నడుస్తోంది. వరసగా ఇప్పుడు బడా సినిమాల్లో హిందీ నటులు విలన్లుగా చేస్తున్నారు. బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి లో అర్జున్ రాంపాల్ విలన్ గా చేసిన విషయం తెల్సిందే. అలాగే రీసెంట్ గా వచ్చిన రన్బీర్ కపూర్ యానిమల్ లో బాబీ డియోల్ విలనీ ఎంతలా పేలిందో మనం చూసాం. కనిపించింది పావు గంట అయినా కూడా ఆ ఇంపాక్ట్ బలంగా ఉంది.
ఇక రాబోయే ఎన్టీఆర్ దేవరలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. విజయ్ లియోలో సంజయ్ దత్ విలన్ గా చేసి ఆకట్టుకున్నాడు. ఇక హిందీ నటులు సౌత్ లో విలన్స్ గా చేయడానికి భారీ రెమ్యునరేషన్లను డిమాండ్ చేస్తుండడం విశేషం.
కనీసం రెండు కోట్లు నుండి మొదలుపెట్టి 4-5 కోట్లు వరకూ తీసుకుంటున్నారు వీరు. మరి రానున్న రోజుల్లో ఈ ట్రెండ్ మరింత పెరిగే అవకాశముంది.