తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ లో వసూళ్లు చేస్తున్న అధిక ఫీజుల విషయం రాష్ట్ర హైకోర్టు గతంలో చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా పలు స్కూల్స్ ఎక్కువ ఫీజ్ లను వసూళ్లు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటీ అంటూ తాజా విచారణ సందర్బంగా హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించాడు. ఇప్పటి వరకు తమ ఆదేశాల అనుసారం ఎన్ని స్కూల్స్ పై చర్యలు తీసుకున్నారో తెలియజేయాలంటూ ప్రశ్నించాడు.
ఈ విషయమై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కోర్టుకు వివరాలు తెలియజేయాలంటూ సీఎస్ మరియు విద్యా శాఖ అధికారులను కోర్టు ఆదేశించింది. ప్రభుత్వం ప్రైవేట్ స్కూల్స్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తుందని గతంలోనే ప్రభుత్వం తరపు లాయర్ కోర్టులో పేర్కొన్నాడు. అందుకే ఇప్పుడు ఎన్ని స్కూల్స్ పై చర్యలు తీసుకున్నారో తెలియజేయాలంటూ కోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో ప్రభుత్వం ఏం సమాధానం ఇస్తుంది అనేది చూడాలి. ఆన్ లైన్ క్లాస్ లు చెబుతూ కూడా పూర్తి ఫీజ్ ను వసూళ్లు చేస్తున్న స్కూల్స్ చాలా ఉన్నాయి. వాటిపై ఎంత వరకు చర్యలు తీసుకున్నారు అనేది తెలియాల్సి ఉంది.
13428 209243Nice one, there is really some great facts on this post some of my subscribers may discover this useful, will send them a link, a lot of thanks. 779777
553798 844742really nice post, i undoubtedly adore this incredible website, carry on it 147276