ఆనందయ్య మందు పంపిణీపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. అత్యవసర పరిస్థితిలో వచ్చిన వారికి కంటి మందు ఇస్తారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అప్పుడంతా అత్యవసరమనే వస్తారని కోర్టుకు విన్నవించింది. నిపుణుల నివేదిక రాకుండా కంటి మందుకు అనుమతి ఇవ్వలేమని కోర్టుకు తెలిపారు. తాము కంటి మందును వ్యతిరేకించడం లేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. మందువల్ల హానిలేదని చెప్తూ వేయటానికి అభ్యంతరం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ న్యాయవాది వాదనలను ఆనందయ్య తరపు న్యాయవాది అశ్వనీకుమార్ వ్యతిరేకించారు.
రోజుకు 15-20 మంది మాత్రమే కంటి మందుకు వస్తున్నట్టు తెలిపారు. మందుకు అనుమతిస్తూనే ప్రభుత్వం ఇలా వ్యవహరించటం మంచిది కాదని ఆనందయ్య తరపు న్యాయవాది వాదించారు. ఇప్పటికే మందు పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ప్రభుత్వ న్యాయవాదులు వాదించారు. కమిటీ నివేదిక వచ్చే వరకూ సమయం ఇవ్వాలని ప్రభుత్వం కోరారు. తమ వాదనలను రికార్డ్ చేయాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు న్యాయవాదులు. దీంతో తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు.
478525 299323Hello! I simply would like to give a huge thumbs up for the great info youve here on this post. I may possibly be coming back to your weblog for far more soon. 346089
610219 401765It is rare knowledgeable folks within this subject, nevertheless, you appear like theres much more you are talking about! Thanks 413808