కరోనా మహమ్మారి ఎందరి జీవితాల్లోనే చిచ్చు పెట్టింది. వైరస్ కారణంగానే కాకుండా పరోక్షంగా కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. తెలంగాణలో జరిగిన ఈ సంఘటనే ఇందుకు సాక్ష్యంగా నిలిచింది. కరోనా వల్ల పాఠశాలలు తెరిచే అవకాశం లేకపోవడంతో ఆన్ లైన్ తరగతులు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే.. ఫోన్లు, ట్యాబ్, కంప్యూటర్లు, ఇంటర్నెట్.. సౌకర్యం లేని వారు ఎందరో ఉన్నారు. ఉన్నా ఆరోగ్య సమస్యలు వచ్చిన వారు ఉన్నారు. ఇదొక సమస్యగా మారింది. ఇప్పుడీ సమస్యే ఓ 15 ఏళ్ల బాలిక బలవన్మరణానికి కారణమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఎన్టీపీసీ కృష్ణానగర్ కు చెందిన కంకణాల సింధుజ తల్లి రజితతో కాలనీలోనే ఉంటుంది. సింధుజ ప్రస్తుతం పదో తరగతికి వచ్చింది. ఇంట్లో ఉంటూ ఆన్ లైన్ క్లాసులు వింటోంది. అయితే.. ఇంట్లో ఒకే సెల్ ఫోన్ ఉండడంతో ఫోన్ కావాలని సింధుజ అడుగుతూండేది. అయితే ప్రతిసారి క్లాసుల కోసం ఫోన్ ఇవ్వడం లేదని సింధుజ మానసికంగా అవేదనకు గురైంది. సింధుజ దివ్యాంగురాలు కూడా కావడంతో మానసిక వేదనతో శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడింది. ఇంటి పైకప్పుకు తన చున్నీ వేలాడదీసి ఉరి వేసుకుంది.
ఇంటికి వచ్చి చూసిన తల్లి కుమార్తె విగతజీవిగా ఉండడంతో హతాశురాలైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రజిత మొదటి భర్త కంకణాల సుధాకర్ పన్నెండేళ్ల క్రితమే మృతి చెందాడు. వీరి సంతానమే సింధుజ. రజిత తర్వాత రవికిరణ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరంతా కలిసే నివసిస్తున్నారు.
733435 749138Id ought to seek advice from you here. Which is not something I do! I love reading an article that could make folks feel. Also, several thanks permitting me to comment! 597252
799283 102782You produced some decent points there. I looked on the internet for that problem and located most individuals goes along with along with your internet internet site. 265687
568914 332077View the following guidelines less than and discover to know how to observe this situation whilst you project your home business today. Earn funds from home 54860