మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ప్లాపుల్లో ఉన్న విషయం తెల్సిందే. రవితేజ లాస్ట్ సినిమా డిస్కో రాజా దారుణమైన పరాభవాన్ని మిగిల్చింది. కేవలం సింగిల్ డిజిట్ షేర్ కే పరిమితమైంది ఈ సినిమా. ప్రస్తుతం రవితేజ ఎలాగైనా హిట్ కొట్టాల్సిన పరిస్థితిలో పడ్డాడు. ఈ నేపథ్యంలో మాస్ రాజా చేస్తున్న సినిమా క్రాక్. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కరోనా రాకపోయి ఉండి ఉంటే ఈపాటికి సినిమా విడుదలైపోయి ఉండేది.
అయితే గత కొద్ది రోజుల నుండి ఈ సినిమా రిలీజ్ విషయంలో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. క్రాక్ డిజిటల్ రిలీజ్ అవుతోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమా విడుదల విషయంలో క్లారిటీ ఇచ్చాడు. క్రాక్ థియేటర్లలోనే విడుదలవుతుంది అని స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో క్రాక్ సినిమా విషయంలో వస్తున్న వార్తలకు బ్రేకులు పడ్డట్లైంది.
శృతి హాసన్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెల్సిందే. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఠాగూర్ మధు నిర్మాత.
816279 430119Some truly marvelous function on behalf of the owner of this internet web site , dead excellent articles . 328901
340282 319060Precisely what I was searching for, thankyou for putting up. 207123