పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విధానాలే చాలా కొత్తగా ఉంటాయి. ఫంక్షన్స్ కు అటెండ్ అవ్వడానికి పెద్దగా ఇష్టపడడు. అదే పెద్ద ఫంక్షన్ కాకపోయినా ఒక్కోసారి హాజరవుతూ ఉంటాడు. ఒకానొక సందర్భంలో నాగబాబు పబ్లిక్ ఫంక్షన్ పై మేము పవన్ ను పిలుస్తాం కానీ వాడే రాడు అని అన్న సంగతి మనందరికీ తెలుసు.
ఇక నిన్న నాగబాబు కూతురు నిహారిక నిశ్చితార్ధ వేడుకకు మొత్తం మెగా ఫ్యామిలీ కదిలొచింది. చిరంజీవి, చరణ్, బన్నీ, సాయి తేజ్, వరుణ్ తేజ్, కళ్యాణ్ దేవ్, వైష్ణవ్ తేజ్ లతో పాటు మిగతా కజిన్స్ కూడా హాజరయ్యారు. అయినా పవన్ కళ్యాణ్ రాలేదు. పవన్ రాని ప్రతీసారి మెగా ఫ్యామిలీ మధ్య ఏవో మనస్పర్థలు ఉన్నట్లు వార్తలు వస్తుంటాయి.
అయితే ఈసారి పవన్ రాకపోవడానికి సరైన కారణమే ఉందనే తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు చాతుర్మాస్య దీక్షలో ఉన్నారు. ఈ దీక్షలో భాగంగా సాయంత్రం 6 తర్వాత పూజలు ఉంటాయి. అందుకనే నితిన్ పెళ్ళికి ముందు కూడా మధ్యాహ్నమే వెళ్లి ఆశీస్సులు అందించి వచ్చారు. నిహారికకు కూడా నిన్న మధ్యాహ్నం వెళ్లి శుభాకాంక్షలు చెప్పినట్లు తెలుస్తోంది. నవంబర్ దాకా పవన్ ఈ దీక్షలో ఉండనున్నారు. ఈలోపు వకీల్ సాబ్ షూట్ ను కూడా తిరిగి మొదలుపెట్టే అవకాశం లేదు.
160950 395467Wonderful weblog here! Also your website loads up fast! What host are you utilizing? Can I get your affiliate link to your host? I wish my website loaded up as quick as yours lol 758768
328524 629164Hello there! Very good post! Please inform us when I will see a follow up! 845953