తిరుమల శ్రీవారి ఆలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వకుళామాత పోటులో గురువారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. లడ్డు తయారీ కేంద్రంలో గోనె సంచులకు నిప్పు అంటుకుంది. ఆ గొనె సంచులకు నెయ్యి అంటి ఉండటం వల్ల స్పీడ్ గా మంటలు వ్యాప్తి చెందాయి. నెయ్యి అంటుకున్న గోనె సంచులు పెద్ద ఎత్తున ఉండటం వల్ల ప్రమాదం మరింతగా పెరిగే అవకాశం ఉందని అంతా భావించారు. కాని అగ్ని మాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలు ఆర్పారు.
ఈ ప్రమాదంపై టీటీడీ అధికారులు ఎంక్వౌరీ చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఈ ప్రమాదం పై సకాలంలో స్పందించడం వల్ల ఎలాంటి ఆస్తి నష్టం ఇతర నష్టాలు జరుగకుండా బయట పడ్డామంటూ ఈ సందర్బంగా అధికారులు చెప్పుకొచ్చారు. వేసవి కాలంలో తిరుమల పోటులో ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. కనుక అగ్నిమాపక సిబ్బంది ఎప్పటికప్పుడు సిద్దంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.