మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు కొద్ది రోజుల క్రితం ప్రభుత్వ అధికారుల తీరుపైనా, ప్రభుత్వంపైనా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన విషయం విదితమే. అయితే, ఆ తర్వాత తన వ్యాఖ్యల్ని మీడియా వక్రీకరించిందంటూ తనదైన స్టయిల్లో ‘కవరింగ్’ ఇచ్చారనుకోండి.. అది వేరే సంగతి.
ఇక, తాజాగా కొత్త జిల్లాల విషయమై ధర్మాన సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లాని విడదీస్తే రాజకీయంగా దెబ్బతింటామని వైసీపీ అధిష్టానాన్ని ఉద్దేశించి చెబుతున్నారు ధర్మాన. లోక్సభ నియోజకవర్గాల్ని పరిగణనలోకి తీసుకుని వాటి ఆధారంగా కొత్త జిల్లాల ఏర్పాటు తగదని అన్నారు దర్మాన. ‘శ్రీకాకుళం జిల్లా విభజన పట్ల స్థానికంగా వ్యతిరేకత వచ్చే అవకాశముంది. ఈ విషయంలో ప్రజా ప్రతినిథుల అభిప్రాయాలు తీసుకోవాలి..’ అంటూ దర్మాన చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా కలకలం సృష్టించాయి.
ప్రస్తుతానికి కొత్త జిల్లాలపై ప్రభుత్వం అధికారికంగా ఎక్కడా ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయితే, ఇటీవల అధికారులతో సమావేశం సందర్భంగా కొత్త జిల్లాల గురించిన ప్రస్తావన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేయడంతో, ఈ అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. మొత్తంగా రాష్ట్రంలో వున్న ప్రస్తుత 13 జిల్లాల సంఖ్యని 25కి పెంచాలనీ, ఈ క్రమంలో పార్లమెంటరీ నియోజకవర్గాల్ని ప్రాతిపదికగా చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి అక్కడి ప్రజల సెంటిమెంట్లు ఎలా వున్నాయి.? జిల్లా విభజనపై జనం ఏమనుకుంటున్నారు.? అన్నదానిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టాల్సి వుంది.
శ్రీకాకుళం జిల్లా అనే కాదు, రాష్ట్రంలో ఇతర జిల్లాల విభజనపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న విషయం విదిమే. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే జిల్లా విభజనపై ‘నిరసన’ స్వరం విన్పించడంతో ఒక్కసారిగా ఈ అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే, కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నానంటూనే, శ్రీకాకుళం జిల్లా విభజన విషయంపై ఆయన మెలిక పెట్టారు. మరి, ఇదే పరిస్థితి ఇతర జిల్లాల్లోనూ కన్పిస్తే.? స్థానిక ప్రజా ప్రతినిథుల నుంచి నిరసన వ్యక్తమయితే ఏంటి పరిస్థితి.?
ఇదిలా వుంటే, ధర్మానకు మద్దతుగా స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా శ్రీకాకుళం జిల్లా విభజన విషయమై స్పందించారు. విభజనతో ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని జిల్లా కోల్పోవాల్సి వస్తే అది బాధాకరమైన విషయం అన్నది తమ్మినేని వాదన. ‘రాష్ట్ర విభజన ఎంత సున్నితమైనదో, జిల్లాల విభజన కూడా అంతే. పరిస్థితిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళతాం..’ అంటూ వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జి విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
51903 401422Thank you for having the time to discuss this topic. I truly appreciate it. Ill stick a link of this entry in my internet site. 365374