ఇటివల వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీటి లెక్కలను భారత వైద్య ఆరోగ్య పరిశోధన మండలి ఓ ప్రకటనలో తెలిపింది. కొవాగ్జిన్ రెండు డోసులూ తీసుకున్న వారిలో 0.04 శాతం మంది.. కోవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్న వారిలో 0.03 శాతం మంది కరోనా బారిన పడ్డట్టు తెలిపింది.
టీకా తీసుకున్న ప్రతి 10 వేల మందిలో నలుగురు కరోనా బారినపడ్డారని ఐసీఎమ్ఆర్ చీఫ్ భార్గవ తెలిపారు. నితీ అయోగ్ సభ్యుడు కేఏ పాల్ మాట్లాడుతూ.. టీకా తీసుకుని కరోనా పాజిటివ్ కు గురైనవారిలో వ్యాధి తీవ్రత చాలా తక్కువగా ఉందన్నారు. కరోనాను అడ్డుకోవడంలో కోవిషీల్డ్ దాదాపు 70 శాతం ప్రభావవంతంగా పని చేస్తోందని లెక్కలు చెప్తున్నాయి.
వ్యాక్సిన్లు రెండో డోసు తీసుకున్న 15 రోజులకు శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వ్యాక్సిన్ ఫేజ్ 3 ట్రయల్స్ ఫలితాల్లో భాగంగా కొవాగ్జిన్ సామర్థ్యం 81 శాతంగా ఉన్నట్టు తేలింది.
474569 648821I adore your wp style, wherever did you download it by means of? 888599
150027 946547Yeah bookmaking this wasnt a high risk determination outstanding post! . 651807