Switch to English

వ్యాక్సిన్ రేటు.. అదిరేట్టు.. ఏంటీ కనికట్టు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

కరోనా వ్యాక్సిన్, మే 1 నుంచి 18 ఏళ్ళ పైబడిన అందరికీ అందుబాటులోకి రానుంది. అయితే, ప్రస్తుతం ఉచితంగా అందిస్తోన్న వ్యాక్సిన్ 45 ఏళ్ళ పైబడినవారికి ఇప్పటిలానే ఉచితంగా లభిస్తుందిగానీ, 18 నుంచి 45 ఏళ్ళ లోపువారికి మాత్రం, ఉచితం కాదు. ఈ విషయాన్ని ఇటీవలే కేంద్రం వెల్లడించింది కూడా. అందుకు తగ్గట్టే వ్యాక్సిన్ కంపెనీలు, ధరల్ని ప్రకటించడం మొదలు పెట్టాయి. ఒక డోసు వ్యాక్సిన్ కోసం కోవిషీల్డ్ ఇకపై 400 నుంచి 600 రూపాయలు వసూలు చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేస్తే 400 రూపాయలు, అదే ప్రైవేటు ఆసుపత్రులు కొనుగోలు చేస్తే 600 రూపాయలన్నమాట.

ఒక్కసారి వ్యాక్సిన్ ‘ప్రైవేటు మార్కెట్’లోకి వస్తే, ఆ మాఫియా ఎలా వుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెమిడిసివిర్ ఇంజక్షన్ మామూలుగా అయితే 900 రూపాయల ధర నుంచి లభ్యమవ్వాలి. కానీ, అదిప్పుడు 60 వేల రూపాయల వరకు ధర పలుకుతోంది. అంటే, కోవిషీల్డ్ వ్యాక్సిన్ ‘బహిరంగ మార్కెట్’లో ఎంతుంటుందో ఊహించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.

కేంద్ర ప్రభుత్వానికి 250 రూపాయలకే వ్యాక్సిన్ అందించగలుగుతున్నప్పుడు, వ్యాక్సిన్ తయారీ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు అదే ధరను అందించలేవు.? అక్కడా.. ఇక్కడా ప్రభుత్వమే వ్యాక్సిన్ కొనుగోలు చేస్తున్నప్పుడు ఇంత తేడా ఎందుకు.? ఇదే సామాన్యుడికి అర్థం కాని ప్రశ్న. తెరవెనుక కారణాలు ఏమైనాగానీ, దేశంలో 130 కోట్ల మంది ప్రజలూ ఇప్పుడు వ్యాక్సిన్ పొందాల్సిందే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.

ముందు ముందు 18 ఏళ్ళ లోపువారికీ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని కేంద్రం ప్రకటిస్తుందా.? అన్నది వేరే చర్చ. దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వలేని ప్రభుత్వం వుంటే ఎంత.? ఊడితే ఎంత.? అన్న చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. ఒకవేళ కేంద్రం, ఉచితంగా వ్యాక్సిన్ అందించినా.. ఆ భారం మళ్ళీ ప్రజల మీద మోపాలి.. పన్నుల రూపంలోనో, ఇంకో రూపంలోనో.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...