దేశ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఎన్నో జీవితాలను చిద్రం చేస్తోంది. దేశ వ్యాప్తంగా ఎన్నో కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి దిక్కులేని వాళ్ల మాదిరిగా మిగిలి పోతున్నారు. రాజస్థాన్ లో దారుణం జరిగింది. తండ్రి కరోనా మరణించడంతో బాధ తట్టుకోలేక కూతురు చనిపోయేందుకు ప్రయత్నించింది. తండ్రి చితిలో దూకి చనిపోయేందుకు ఆమె ప్రయత్నించింది. 70 శాతం కాలిన గాయాలతో ఆమెను ఆసుపత్రిలో జాయిన్ చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఇండో పాక్ సరిహద్దులో బార్మెర్ జిల్లా లో ఈ సంఘటన జరిగింది. జిల్లాకు చెందిన దామోదర్ దాస్ కోవిడ్ 19 తో ఇటీవల మృతి చెందాడు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు ఒంటరిగా మారారు. దామోదర్ చితిలో కుమార్తె చంద్ర శారద కూడా దూకడంతో 70 శాతంకు పైగా కాలిపోయింది. దాంతో ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందంటూ వైధ్యులు చెప్పారట. ఆమెను కుటుంబ సభ్యులు బతికించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
199476 9634Excellent day! This post could not be written any better! Reading this post reminds me of my previous room mate! He always kept chatting about this. I will forward this write-up to him. Fairly certain he will have a excellent read. Thanks for sharing! 64793