టీం ఇండియా స్టార్ ఆటగాళ్లు హార్థిక్ పాండ్య మరియు కృనాల్ పాండ్య తండ్రి హిమాన్షు పాండ్య నేడు ఉదయం గుండె పోటుతో మృతి చెందారు. ఆయనకు నేడు ఉదయం గుండె పోటు రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో జాయిన్ అయిన హిమాన్షు పాండ్య అప్పటికే మృతి చెందినట్లుగా వైధ్యులు పేర్కొన్నారు. వారి ప్రయత్నం చేసినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ఆస్ట్రేలియా పర్యటన నుండి ఇప్పటికే ఇండియా చేరిన హార్ధిక్ పాండ్య తండ్రి మరణ వార్త తెలియడంతో వెంటనే ముంబయి చేరుకుంటున్నాడు.
మరో వైపు కృనాల్ పాండ్యా కూడా బరోడా తరపున సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోపీ ఆడుతున్నారు. తండ్రి మరణ వార్త తెలిసిన వెంటనే ముంబయి బయలుజేరాడు. ఇటీవలే ఈ ఇద్దరు బ్రదర్స్ తండ్రి హిమాన్షు పాండ్యాతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంతలో ఇలా జరగడంతో అభిమానులు కన్నీరు పెట్టుకుంటున్నారు. పాండ్య బ్రదర్స్ కు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
848054 429407This write-up is very appealing to thinking individuals like me. Its not only thought-provoking, it draws you in from the beginning. This is well-written content material. The views here are also appealing to me. Thank you. 416114