తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. కరోనా బాధితుల్లో పోలీసులు, వైధ్యులు, పారిశుద్య కార్మికులు సైతం చేరుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఉస్మానియా వైధ్య కళాశాలకు చెందిన విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయిన విషయం తెల్సిందే. దాంతో యూనివర్శిటీ హాస్టల్ను పూర్తిగా క్వారెంటైన్ కేంద్రంగా మార్చేశారు. ఇదే సమయంలో నిమ్స్ వైధ్యులకు కూడా కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అవ్వడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యిందంటూ ఆందోళన వ్యక్తం అవుతోంది.
నిమ్స్ హాస్పిటల్కు చెందిన కార్డియాలజీ విభాగంలో నలుగురు వైధ్యులు మరియు ముగ్గురు సిబ్బందికి కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయ్యింది. ఈ విషయంలో నిమ్స్ ఉన్నతాధికారులు మరియు వైధ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ వైధ్యులకు సోకుతున్న నేపథ్యంలో దేశంలో పరిస్థితి మరింతగా విషమించినట్లే అంటూ ప్రభుత్వ వర్గాల వారు హెచ్చరిస్తున్నారు. ప్రతి చోట కరోనాకు చెందిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అని, మాస్క్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ల కూడదు, ఎప్పటికప్పుడు చేతులను శానిటైజేషన్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
228404 230305Enjoyed searching at this, very great stuff, thanks . 379566
138418 200854HURRAY! cant balladeer. by virtue of himself by what name highly. 860612