ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ప్రతి రోజు కూడా దాదాపుగా 20 వేల కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ ఏ ఒక్కరిని విడిచి పెట్టేలా లేదు. వారు వీరు అనే తేడా లేకుండా ప్రముఖులు పలువురు కరోనా బారిన పడుతున్నారు. ప్రస్తుతం కరోనా ఏపీలో కరాళ నృత్యం చేసుంది అనేందుకు సాక్ష్యం అన్నట్లుగా ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది. వారు కాస్త సీరియస్ లక్షణాలతో కరోనాతో బాధపడుతున్నట్లుగా సమాచారం అందుతోంది.
తమ్మినేని కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయిన విషయం మీడియాకు ఆలస్యంగా తెలిసింది. ఆయన కరోనా తో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఆయనతో పాటు ఆయన సతీమణి వాణిశ్రీ కూడా కరోనాతో బాధపడుతున్నట్లుగా ప్రభుత్వ వర్గాల ద్వారా సమాచారం అందింది. తమ్మినేని ఆరోగ్య విషయమై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాకబు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం తమ్మినేని దంపతుల ఆరోగ్య పరిస్థితి కాస్త సీరియస్ గా ఉన్నా కూడా నిలకడగా ఉన్నారని అంటున్నారు. వారం రోజుల్లో వారు పూర్తి ఆరోగ్య వంతులు అవుతారని వైధ్యులు అన్నారంటూ వైకాపా నాయకులు చెబుతున్నారు.
381250 259676Its a shame you dont have a donate button! Id without a doubt donate to this brilliant weblog! I suppose for now ill settle for book-marking and adding your RSS feed to my Google account. I look forward to fresh updates and will share this weblog with my Facebook group. Chat soon! 206426