కరోనా రెండో దశ ప్రళయానికి మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. స్మశానాల్లో ఖాళీ ఉండటం లేదు.. మృతదేహాలు గుట్టలుగా పేరుకుంటున్నాయి.. మృతదేహాలను తీసుకొస్తున్న ఆంబులెన్సులు క్యూలు కడుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్-19 బాధితుల మృతదేహాలను తరలించడంలో అధికారుల నిర్లక్ష్యం ఎలా ఉందో తెలిపే ఘటన మధ్యప్రదేశ్లో శుక్రవారం జరిగింది.
విదిషా జిల్లాలో అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వ వైద్య కళాశాల సమీపంలో ఓ ఆసుపత్రి నుంచి ఆంబులెన్సులో శ్మశానవాటికకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఓ కరోనా మృతదేహం కిందపడిపోయింది. డ్రైవర్ అధిక వేగంతో వాహనాన్ని మలుపు తిప్పడంతో అంబులెన్స్ కు గేట్ తగిలి విరిగిపోయింది. ఈక్రమంలోనే మృతదేహం ఎగిరి రోడ్డుపై పడింది.
దీన్ని గమనించిన కోవిడ్ -19 రోగుల బంధువులు ఆసుపత్రి బయటకి వచ్చి హాస్పిటల్ తీరుపై ఆందోళన చేపట్టారు. ఇందుకు సంబధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. విధిశా జిల్లాలో కోవిడ్ మరణాలు అధికమయ్యాయి. ప్రతిరోజూ 20 నుంచి 25 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోతున్నారు.
312495 235239I like this internet site because so significantly helpful material on here : D. 460490
140646 406148learning toys can enable your kids to develop their motor skills quite easily;; 443388