Congress – TRS: తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ ఈక్వేషన్స్ అనూహ్యంగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి రెండో లిస్టు వచ్చింది ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిల పేర్లు లిస్టులో కనిపించాయి. ఇంకా సుమారు 19 మంది అభ్యర్థుల్ని కాంగ్రెస్ ప్రకటించాల్సి వుంది.
ఎన్నికల ముందర కాంగ్రెస్ పార్టీలోకి నేతల వలసలు పెరుగుతున్నాయి. గతంలో కాంగ్రెస్లో పని చేసిన నేతలే, ఇతర పార్టీల్లోకి వెళ్ళి, మళ్ళీ కాంగ్రెస్లోకి వస్తున్నారు. అదే సమయంలో ఇతర పార్టీల్లో టిక్కెట్లు దక్కని నేతలు, అక్కడ టిక్కెట్లు దక్కించుకున్న నేతలూ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్మలాటలు ఓ వైపు, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు పోటెత్తుతున్న నేతల వలసలు ఇంకో వైపు.. వెరసి, కాంగ్రెస్ ఈక్వేషన్ విషయమై రాజకీయ విశ్లేషకులే ఆశ్చర్యపోవాల్సి వస్తోంది.
అధికార బీఆర్ఎస్ బలహీన పడుతున్నట్లు కనిపిస్తుండడం, భారతీయ జనతా పార్టీ పూర్తిగా తేలిపోతుండడం.. వెరసి, కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అవుతోంది. ప్రస్తుతానికైతే పోటీ బీఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్యనే.. అన్నట్లు తయారైంది. ఇది నిజంగానే అనూహ్యమైన పరిణామం.
రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. పోలింగ్కి ఇంకా దాదాపు నెల రోజుల సమయం వుంది. ఇంత సుదీర్ఘ సమయం వుండడంతో.. ఈక్వేషన్స్ రోజుకోరకంగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ వర్గానికి మెజార్టీ టిక్కెట్లు దక్కిన మాట వాస్తవం. రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు రావడం మరో ఆసక్తికర అంశం.
దాంతో, రేవంత్ టీమ్ మరింత అగ్రెసివ్గా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోవచ్చు. కాంగ్రెస్లో ఈ జోరు సహజంగానే అధికార బీఆర్ఎస్కి మింగుడు పడ్డంలేదు. ఆ ఆందోళన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్లో స్పష్టంగా కనిపిస్తోంది.
What’s up, I would like to subscribe for this webpage to obtain most up-to-date
updates, thus where can i do it please help.