కరోనా నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వరి ధాన్యాన్ని గ్రామాల్లోనే వరి ధాన్యం కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. 6,408 కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వమే పూర్తి స్థాయిలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నట్లు సీఎం తెలిపారు. ప్రగతి భవన్ లో వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖలపై జరిపిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో గత ఏడాదిలానే ఏర్పాట్లు చేయాలన్నారు. ధాన్యం కొనుగోలుకు అవసరమైన 20వేల కోట్ల రూపాయలకు బ్యాంకు గ్యారంటీ ఇచ్చే ఏర్పాట్లు వెంటనే చేయాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు.
హైదరాబాద్ లోనే ఉండి కోనుగోలు కేంద్రాల ఏర్పాటును, ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి సూచించారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని సీఎస్, వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖలను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో, కనీస మద్దతు ధర విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదన్నారు.
వడ్లు ఎండబోసి తాలు లేకుండా.. 17శాతం తేమకు మించకుండా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో 20 కోట్ల గన్నీ బ్యాగులను సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఈసారి పత్తిని 75 నుండి 80 లక్షల ఎకరాల్లో పండించేందుకు సిద్ధం కావాలని రైతులను సీఎం కోరారు. ఇందుకు అవసరమైన విత్తనాలు సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.
20 నుండి 25 లక్షల ఎకరాల్లో కందిపంట సాగు చేసేలా చూడాలని కూడా సూచించారు. ఈ యాసంగిలో 52.76 లక్షల ఎకరాల్లో వరి పంట పండిందని తెలిపిన సీఎం.. దాదాపు 1కోటి 17లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం, 21 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. ఆహార ధాన్యాల నిల్వల కోసం అదనపు గోదాములను నిర్మించాలన్నారు. ఇందుకు సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ సిద్ధంగా ఉందని.. స్థలాలు ఎంపిక చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
274735 442492Hey there, Can I copy this post image and implement it on my individual internet log? 348173