Switch to English

సీఎం క్యాంప్‌ ఆఫీస్‌.. ఒకటీ.. రెండూ.. మూడూ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి అతి పెద్ద సమస్యగా మారింది రాజధాని వ్యవహారం. భారతదేశానికి ఒకే రాజధాని వుంది.. అది ఢిల్లీ. కానీ, ఆంధ్రప్రదేశ్‌కి మాత్రం మూడు రాజధానులు అవసరమయ్యాయి. మింగడానికి మెతుకుల్లేవుగానీ.. మీసాలకు శంపంగె నూనె కావాలన్నాడట వెనకటికి ఒకడు. అలా వుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని కహానీ. ఒక్క రాజధానికే దిక్కులేదుగానీ.. మూడు రాజధానులు అవసరమంటూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేస్తోన్న పబ్లిసిటీ స్టంట్స్‌.. రాష్ట్రానికి పెను శాపంగా మారుతున్నాయి.

అభివృద్ధి అటకెక్కి.. ఈ రాజధాని చుట్టూనే రచ్చ జరుగుతోంది. ఓ పక్క కోర్టుల్లో కేసులు.. ఇంకోపక్క రాజధాని అమరావతిలో ఉద్యమాలు.. మరోపక్క రాజకీయ రచ్చ.. ఇదీ ఆంధ్రప్రదేశ్‌ దుస్థితి. తాజాగా సీఎం క్యాంప్‌ కార్యాలయం విషయమై హైకోర్టులో విచారణ జరిగింది. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని.. అన్నది ప్రభుత్వ వాదన. క్యాంప్‌ కార్యాలయాలనేవి సర్వసాధారణమైన వ్యవహారాలు.

గతంలో చంద్రబాబు, హైద్రాబాద్‌లో ఒకటి.. అమరావతిలో ఒకటి.. క్యాంప్‌ కార్యాలయాలు మెయిన్‌టెయిన్‌ చేసేవారు. అప్పట్లోనే ఈ విషయమై రాజకీయంగా చాలా విమర్శలొచ్చాయి. ఇప్పుడేమో విశాఖలో క్యాంప్‌ కార్యాలయం అంటున్నారు. ప్రస్తుతానికి సీఎం జగన్‌, తన ఇంటినే క్యాంప్‌ కార్యాలయంగా మలచుకుని విధులు నిర్వహిస్తున్న విషయం విదితమే. సీఎం ఎక్కడుంటే అదే క్యాంప్‌ కార్యాలయం.. అంటే, ఢిల్లీకి వెళ్ళినప్పుడు అవసరమవుతుంది కాబట్టి, అక్కడ ప్రత్యేకంగా ఓ కార్యాలయం కడతారా.? అన్న ప్రశ్న న్యాయస్థానం యెదుట ఉత్పన్నమయ్యింది.

నిజమే.. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడినుంచే పరిపాలన జరుగుతుంది. కానీ, అలా ముఖ్యమంత్రి ఓ చోట నుంచి పరిపాలన చేయాలి కాబట్టే.. రాజధాని అవసరం. ఈ ఇంగితాన్ని ప్రభుత్వ పెద్దలు ఎలా విస్మరిస్తున్నారో ఏమో.!

అమరావతి నుంచి ఎలాగైనా రాజధానిని తరలించేయాలన్నది అధికార పార్టీ తొందర. కానీ, అందుకు పరిస్థితులు అనుకూలించడంలేదాయె. రాష్ట్రానికి ఇప్పుడు ఏది అత్యవసరం.? అన్న విషయంలో గత చంద్రబాబు ప్రభుత్వమూ సరైన ఆలోచన చేయలేదు. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వమూ చేయడంలేదు.

అభివృద్ధి కావాలి ఆంధ్రప్రదేశ్‌కి. ఆ ఒక్కటి తప్ప.. అన్నీ జరుగుతున్నాయి. అభివృద్ధిలేని రాష్ట్రం భవిష్యత్‌ అగమ్యగోచరం. ఓటు బ్యాంకు రాజకీయాలు.. కక్ష పూరిత రాజకీయాలు అధికారంలో వున్నవాళ్ళు చేస్తే.. అది రాష్ట్ర ప్రజలకు పెను శాపంగా మారుతుంది. క్యాంప్‌ ఆఫీసులంటూ పబ్లిసిటీ స్టంట్లు చేయాలనుకుంటే జిల్లాకి ఒకటి సరిపోదు.. ఊరికొక సీఎం క్యాంప్‌ కార్యాలయం అవసరమవుతుందేమో.!

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మంచు...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...