భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గుణశేఖర్. రుద్రమదేవి తర్వాత భారీ గ్యాప్ తీసుకున్న గుణశేఖర్ ఇప్పుడు శాకుంతలం చిత్రాన్ని డైరెక్ట్ చేస్తోన్న విషయం తెల్సిందే. సమంత హీరోయిన్ గా ఈ సినిమా పట్టాలెక్కింది. మలయాళ నటుడు దేవ్ మోహన్ లీడ్ రోల్ లో నటిస్తున్నాడు. మహాభారతంలోని ఆది పర్వంలోని చిన్న భాగాన్ని తీసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఇక తాజాగా ఈరోజు గుణశేఖర్ కు కరోనా పాజిటివ్ వచ్చిందని దాంతో శాకుంతలం షూటింగ్ ను అర్ధాంతరంగా నిలిపివేశారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు దీనిపై క్లారిటీ ఇచ్చాడు గుణశేఖర్. తనకు మొదట కరోనా పాజిటివ్ అని రిపోర్ట్స్ వచ్చిన మాట వాస్తవమే అని, అయితే అవి తప్పుడు రిపోర్ట్స్ అని తెలిపాడు గుణశేఖర్.
గుణశేఖర్ కు కరోనా లేదని తెలియడంతో శాకుంతలం షూటింగ్ ను తిరిగి మొదలుపెట్టబోతున్నాడు గుణశేఖర్.