కేంద్ర ప్రభుత్వం తాజాగా పార్లమెంట్ లో ఒక ప్రశ్నకు సమాధానంగా లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఏపీ రాజధాని విశాఖ అన్నట్లుగా పేర్కొన్నారు. దాంతో వైకాపా శ్రేణులు కేంద్ర ప్రభుత్వం ఏపీ రాజధాని గా విశాఖ ను గుర్తించినట్లే అంటూ ప్రచారం చేసుకోవడం మొదలు పెట్టారు. దాంతో రాజకీయ రచ్చ మొదలు అయ్యింది. బీజేపీ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వం తో తప్పు సరిదిద్దుకునేలా చేసింది. కేంద్రం స్పందిస్తూ తమ ఉద్దేశ్యంలో ఏపీ రాజధాని విశాఖ కాదు అంటూ క్లారిటీ ఇచ్చారు.
పార్లమెంటు సచ్చివాలయంతో పాటు కేంద్ర మంత్రిత్వ శాఖ నుండి కూడా ఈ విషయమై క్లారిటీ వచ్చింది. సవరణతో మరో లిఖిత పూర్వక సమాధానం వస్తుందని కేంద్రం పేర్కొంది. రాష్ట్రం రాజధాని అని కాకుండా రాష్ట్రంలోని ముఖ్య నగరాలను చూపించినట్లుగా పేర్కొన్నారు. కాని హెడ్డింగ్ లో తప్పు దొర్లడం వల్ల ఈ సమస్య తలెత్తింది అని.. ఇందులో వివాదాస్పదం ఏమీ లేదని వెంటనే రాజధాని విషయంలో తమ వాదన ఏమీ లేదని… విశాఖను కేంద్రం ఇంకా గుర్తించలేదు అంటూ స్పష్టం చేయడం జరిగింది.
702271 580879Is gonna be back often to inspect new posts 992642
40415 172613This design is steller! You most certainly know how to maintain a reader entertained. Between your wit and your videos, I was almost moved to start my own weblog (nicely, almostHaHa!) Great job. I actually loved what you had to say, and far more than that, how you presented it. Too cool! 218489