మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో ‘ఆచార్య’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. త్వరలోనే ట్రయిల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో ఈ సినిమా షూటింగ్ ని తిరిగి ప్రారంభించే పనిలో ఉన్నారని సమాచారం. ఆ సినిమా తర్వాత వెంట వెంటనే సినిమాలు చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు చిరు. ఆ లిస్టులో ఇప్పటికే మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ సూపర్ హిట్ ‘వేదాళం’ రీమేక్ చేరింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జోరుగా సాగుతున్నాయి.
ఈ సమయంలో మాకు కొన్ని ఆసక్తికర విషయాలు తెలిసాయి. ఈ వేదాళం రీమేక్ ని వచ్చే ఏడాది మార్చి నుంచి షూట్ చేసేలా ప్లాన్ చేశారు. అలాగే చిరు నటించిన ‘చూడాలని ఉంది’ సినిమా ఆయన కెరీర్లో ఓ బ్లాక్ బస్టర్ సినిమా. ఈ సినిమా కోసం అప్పట్లో కోల్ కతా బ్యాక్ డ్రాప్ ని ఎంచుకున్నారు. ఆ సినిమాకి కోల్ కతా బ్యాక్ డ్రాప్ చాలా పెద్ద హెల్ప్ అయ్యింది. ఇప్పుడు అదే బ్యాక్ డ్రాప్ సెటప్ ని చిరు వేదాళం రీమేక్ కి కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమాలోని మేజర్ ఎపిసోడ్ కోల్ కతాలో తీయనున్నారు.
మెహర్ రమేష్ ఆ మ్యాజిక్ ని మరోసారి రిపీట్ చేసే విధంగా స్క్రిప్ట్ కి మెరుగులు దిద్దుతున్నారు. వేదాళం సినిమాలో అజిత్ కు చెల్లి పాత్రలో లక్ష్మీ మీనన్ నటించింది. హీరో చెల్లి పాత్రకు సినిమాలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే తెలుగు రీమేక్ లో సాయి పల్లవి లాంటి స్టార్ హీరోయిన్ ని ఎంచుకున్నారు. మణిశర్మ తనయుడు సాగర్ మహతి మొదటి సారి మెగాస్టార్ సినిమాకి మ్యూజిక్ ఇవ్వనున్నాడు.
ఈ చిత్రం తర్వాత బాబీ దర్శకత్వంలో చిరంజీవి ఒక సినిమాను చేయబోతున్నాడు. ఇదే సమయంలో మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ ను కూడా చిరు రీమేక్ చేయాల్సి ఉంది. కనుక ఖచ్చితంగా ఈ మూడు సినిమాలను స్పీడ్ గా తక్కువ సమయంలోనే చేయాలనుకుంటున్నాడు. వచ్చే ఏడాదిలో చిరంజీవి రెండు లేదా మూడు సినిమాలు వచ్చినా ఆశ్చర్యం లేదని మెగా వర్గాల వారు అంటున్నారు.
133247 636950Some genuinely good stuff on this site , I enjoy it. 123189
242249 420987This web web site is really a walk-through for all with the info you wanted about this and didnt know who to ask. Glimpse here, and you will definitely discover it. 938494
613833 742401I feel this web internet site has very superb composed topic material articles . 634537