Switch to English

బీజేపీ స్వరం మారుతోంది.. జనసేన పరిస్థితేంటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,430FansLike
57,764FollowersFollow

భారతీయ జనతా పార్టీతో స్నేహం కోరుకుంటోంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ. నిన్ననే ఢిల్లీకి వెళ్ళిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆయన ఢిల్లీకి వెళ్ళి, ప్రధానిని కలిశారన్నది వైసీపీ వాదన. కానీ, ‘బీజేపీ – వైసీపీ’ మధ్య స్నేహ బంధం బలపడే క్రమంలో ఇదో కీలకమైన ముందడుగు.. అంటూ వైసీపీ వర్గాల నుంచి లీకులు అందుతున్నాయి.

త్వరలో వైసీపీ, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో చేరబోతోందన్నది ఆ లీకుల సారాంశం. కాగా, తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో రేపు వైఎస్‌ జగన్‌ భేటీ కాబోతున్నారన్నది ఇంకో ప్రచారం. అయితే, రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై కేంద్ర హోంమంత్రితో చర్చించేందుకే ముఖ్యమంత్రి హోదాలో వైఎస్‌ జగన్‌ ఢిల్లీకి వెళుతున్నారన్నది మరో వెర్షన్‌.

వైఎస్‌ జగన్‌ ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వెంటనే, శాసన సభ, శాసన మండలి ప్రోరోగ్‌ ఆదేశాలు బయటకొచ్చాయి. తద్వారా 3 రాజధానుల అంశం అలాగే సీఆర్డీయే ఉప సంహరణ అంశాలపై ఆర్డినెన్స్‌ తెచ్చేందుకు ప్రభుత్వానికి అవకాశం కలగనుంది. ఇది ఢిల్లీ పెద్దలు ఇచ్చిన సలహానే.. అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

మరోపక్క, టీడీపీ ముఖ్య నేతలపై ఇటీవల ఐటీ సోదాలకు సంబంధించి ఈ రోజు ఐటీ శాఖ నుంచి ఓ ప్రకటన రావడం కూడా.. పై ప్రచారానికి మరింత బలాన్నిస్తోంది. ‘కేంద్రం – రాష్ట్రం మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయి’ అంటూనే, రాష్ట్రంలో జగన్‌ పాలన పట్ల బీజేపీ నేతల్లో చాలామంది సంతోషంగా వున్నారనీ, వారెవరికీ వైసీపీతో విభేదాల్లేవనీ, భవిష్యత్తులో రెండు పార్టీలూ కలిసి పనిచేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కొందరు వైసీపీ నేతలు ఆఫ్‌ ది రికార్డ్‌గా వ్యాఖ్యానిస్తున్నారు.

అదే నిజమైతే, జనసేన పార్టీ పరిస్థితి ఏంటి.? ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ కొందరు బీజేపీ నేతలు, ‘కేంద్ర – రాష్ట్ర సంబంధాలు వేరు’ అని చెబుతున్నారు. ‘ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీతో బీజేపీ కలిసి వెళ్ళే అవకాశమే లేదు’ అని కుండ బద్దలుగొట్టేస్తున్నారు ఏపీ బీజేపీకి చెందిన కొందరు నేతలు. కాగా, తాజా రాజకీయ సమీకరణాలపై జనసేన పార్టీ శ్రేణులు ఆచి తూచి స్పందిస్తున్నాయి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను...

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...