కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ ఫలితాలు గతంతో పోలిస్తే మరింత మెరుగైనట్టు భారత్ బయోటెక్ స్పష్టం చేసింది. ప్రస్తుతం జరుగుతున్న మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లో టీకా సామర్ధ్యం 81 శాతంగా నమోదైందని సంస్థ వెల్లడించింది. అత్యవసర వినియోగం నిమిత్తం కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఇప్పటికే దేశంలో వినియోగంలో ఉంది. ఈ నేపథ్యంలో కోవాగ్జిన్ వ్యాక్సిన్ సామర్ధ్యం అంచనా వేయడం కోసం క్లినికల్ ట్రయల్స్ ఇంకా కొనసాగుతాయని భారత్ బయోటెక్ సంస్థ తెలిపింది.
ఈ మేరకు భారత్ బయోటెక్ ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల మాట్లాడుతూ.. ‘దేశంలోనే అతిపెద్ద క్లినికల్ ట్రయల్స్ చేపట్టాం. కరోనా వైరస్ ఉత్పరివర్తనాలకు వ్యతిరేకంగా కోవాగ్జిన్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఆశాజనకంగా ఉన్నాయి, యూకే వైరస్ పై కూడా కోవాగ్జిన్ సమర్ధవంతంగా పని చేస్తుంది. ఆక్స్ ఫర్డ్ కు చెందిన కోవిషీల్డ్ సామర్ధ్యం 70 శాతం ఉంటే.. కోవాగ్జిన్ సామర్ధ్యం 81 శాతంగా ఉంది’ అని తెలిపారు.
872237 122272Just wanna remark that you have a quite nice internet site , I like the layout it in fact stands out. 793630
877731 700951I truly prize your piece of work, Excellent post. 761590