క్రికెట్లో భారత్ సూపర్ స్ట్రాంగ్ గా ఆడితే ఫలితమేంటో.. గబ్బా టెస్ట్ విజయం నిరూపించింది. బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ లో భాగంగా జరిగిన ఆసీస్ తో జరిగిన ఆఖరి టెస్టులో భారత్ చారిత్రాత్మక విజయం సాధించింది. క్రీజ్ వద్ద పాతుకుపోవడమే కాదు.. ఆసీస్ బౌలింగ్ లైనప్ ను తుత్తునీయులు చేసిన టీమ్ ఇండియా 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుని బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ముద్దాడింది. దేశం యావత్తూ పులకించిపోయిన ఈ విజయానికి బీసీసీఐ మురిసిపోయి టీమ్ ఇండియాకు 5 కోట్ల నజరానా ప్రకటించింది.
ఈ సంఖ్య కంటే విజయమే ఎంతో విలువైనది అని బీసీసీఐ చీఫ్ గంగూలి వ్యాఖ్యినించాడు. గబ్బా స్టేడియంలో 32 ఏళ్లుగా తిరుగులేని ఆసీస్ కు భారత్ ఓటమి రుచి చూపించింది. ఈ సిరీస్ లో భారత్ ఆటగాళ్లకు జాతి విద్వేషపూరిత వ్యాఖ్యలు ఎదురయ్యాయి. ఆస్ట్రేలియా సీనియర్ ఆటగాళ్ల నుంచి టీమ్ పై వ్యతిరేక వ్యాఖ్యలు వచ్చాయి. వీటన్నింటినీ ధీటుగా ఎదుర్కొన్న భారత్ తిరుగులేని సిరీస్ విజయాన్ని సొంతం చేసుకుంది.
62025 252709I like the valuable data you offer inside your articles. Ill bookmark your weblog and check once more here often. Im quite certain Ill learn plenty of new stuff correct here! Very best of luck for the next! 186036
388413 442220Im having a small difficulty. Im unable to subscribe to your rss feed for some reason. Im making use of google reader by the way. 831486