బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కు హైకోర్టులో ఊరట లభించింది. వ్యక్తిగత పూచీకత్తుపై ఆయన్ను విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈక్రమంలో బండి సంజయ్ ను అరెస్టు చేసిన తీరుపై హైకోర్టు తప్పుబట్టింది. రాత్రి 10:50కి అరెస్టు చేస్తే 11:15కి కేవలం 15 నిమిషాల్లోనే ఎలా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ప్రశ్నించింది. తోపులాటలో పోలీసులకు గాయాలయ్యాయని పేర్కొన్నా.. రిమాండ్ రిపోర్టులో వారి గాయాలకు సంబంధింధి ఎటువంటి మెడికల్ రిపోర్టు లేదని తెలిపింది.
కోవిడ్ నిబంధనల ఉల్లంఘనను చూపించి 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించడం సరైన చర్య కాదని అభిప్రాయపడింది. దీంతో ఆయన రిమాండ్ పై స్టే విధించి.. పూర్తి వివరాలు అందించాలని ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఈక్రమంలో పిటిషన్ ఫిబ్రవరి 7కు వాయిదా వేసింది. ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 317ను సవరించాలనే డిమాండ్ తో కరీంగనర్ లో బండి సంజయ్ తలపెట్టిన జాగరణ దీక్ష ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే.
520491 93436I take fantastic pleasure in reading articles with quality content. This article is 1 such writing that I can appreciate. Maintain up the very good function. 270093