ఏపీ నూతన ఎస్ఈసీగా నీలం సాహ్ని రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. వెంటనే పరిషత్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించనున్నారు. ప్రమాణస్వీకారం తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏప్రిల్ 8న ఎన్నికలు, 10న ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మరోవైపు నేడు రాష్ట్ర ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.
తన హయాంలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు సమర్ధవంతంగా నిర్వహించినట్టు తెలిపారు. ప్రభుత్వ సహకారం మరువలేనిదని అన్నారు. కలెక్టర్లు, పోలీసులు, సిబ్బంది సహకారం మరువలేనిదని అన్నారు. ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ మధ్య పోరు టీకప్పులో తుఫానులా ముగిసిపోయిందని కూడా అన్నారు. ఎస్ఈసీగా తన పదవీ కాలం సంతృప్తినిచ్చిందని అన్నారు.