కేవలం రెండున్నరేళ్ళలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార పార్టీ సీన్ రివర్స్ అయిపోయింది. ఆగండాగండీ.. అధికార పీఠమెక్కిన మొదటి రోజు నుంచే వైఎస్ జగన్ సర్కారు, రాష్ట్రంలోని వివిధ వర్గాల నుంచి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తోంది. అధికారంలోకి వచ్చాక వారం రోజుల్లోనే ‘సీపీఎస్’ రద్దు చేస్తామంటూ ఎన్నికల హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోయిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అప్పటి నుంచీ ‘రివర్స్ గేర్’ వేస్తూనే వున్నారు.
రివర్స్ టెండరింగ్ దగ్గర్నుంచి.. రివర్స్ పాలన వరకూ.. అన్నిటా, అంతటా గందరగోళమే. జీవోలు రద్దవుతున్నాయ్.. రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాలే రద్దవుతున్నాయ్. వాళ్ళూ వీళ్ళూ అన్న తేడాల్లేకుండా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నమ్మినోళ్ళంతా రోడ్డెక్కుతున్నారు.. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సహా. ఇదెక్కడి పాలన.? ఇదేం రాజకీయం.? క్యాపిటల్ కోసం భూములిచ్చిన రైతులు రోడ్డెక్కారు.. ఇసుక పాలసీ పుణ్యమా అని భవన నిర్మాణ రంగ కార్మికులు రోడ్డెక్కారు.. బిల్లులు చెల్లించడంలేదని కాంట్రాక్టర్లూ రోడ్డున పడ్డారు.. ఉద్యోగాలెక్కడ.? అంటూ నిరుద్యోగ యువత రోడ్డున పడింది. కోవిడ్ సమయంలో మాస్కులు, పీపీఈ కిట్ల కోసం వైద్యులు రోడ్డెక్కిన సందర్భాలూ చూశాం.
గొప్పగా వైఎస్ జగన్ ప్రభుత్వం చెప్పుకుంటోన్న వాలంటీర్లు రోడ్డున పడటం ఒక ఎత్తయితే, ఇంటి వద్దకే రేషన్.. అంటూ రేషన్ వాహనాల పేరుతో ప్రభుత్వం హంగామా చేస్తే, ఆ వాహనాల లబ్దిదారులు ‘మాకొద్దు బాబోయ్ ఈ వాహనాలు’ అంటూ రోడ్డున పడ్డ విషయాన్నీ చూశాం. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులూ రోడ్డున పడ్డారు. వాట్ నెక్స్ట్.? కాదు కాదు, హూ నెక్స్ట్.? ఏమో, ఎవరు రోడ్డున పడతారోగానీ, ఇదంతా విపక్షాల రాజకీయ కుట్ర.. అంటూ ఇంకా తమ వైఫల్యాల పట్ల బుకాయింపులకు అధికార పార్టీ దిగితే, ఆ బులుగు పతనం మరింత వేగంగా జరుగుతుంది. ఎనీ డౌట్స్.?
164135 575242Made to measure curtains […]check out the sites listed below, worth a read for interiors and rugs enthusiasts[…] 433869