‘రాజధాని అమరావతిని నిర్మించేందుకు లక్ష కోట్లు అవసరం.. అంత ఖర్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయడానికి కుదరదు.. రాష్ట్ర సమగ్రాభివృద్ధి మాకు ముఖ్యం..’ అంటూ ‘ఖర్చు’ కబుర్లను అధికార వైసీపీ నేతలు చాలా చాలా గొప్పగా చెప్పేశారు. కానీ, మూడు రాజధానుల వ్యవహారానికి సంబంధించి బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు ఇచ్చిన ‘రిపోర్ట్’ కోసం ఏకంగా 10 కోట్లు ఖర్చు చేసేశారు.
‘సొమ్ములెవడివి.? సోకులెవడివి.?’ అన్న ప్రశ్న ఇలాంటి సందర్భాల్లోనే ప్రజల నుంచి దూసుకొస్తుంటుంది. 10 కోట్లు అంటే ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. గతంలో చంద్రబాబు హయాంలో ఇలాగే ప్రజాధనం అత్యంత దారుణంగా దుర్వినియోగమయ్యింది. ‘శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది రాష్ట్ర సమగ్రాభివృద్ధి గురించే.. అదే బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ కూడా చెప్పింది.. మా ప్రభుత్వ అభిప్రాయం కూడా అదే..’ అంటూ ప్రభుత్వ పెద్దలు చెప్పిన, చెబుతున్న కబుర్లను ఇక్కడ ప్రస్తావించుకోవాలి.
అన్నట్టు, శివరామకృష్ణన్ కమిటీ పేర్కొన్న విషయాల్ని అక్షర దోషాలతో సహా, బిసిజి రిపోర్ట్లో పేర్కొన్నారన్న విమర్శలూ లేకపోలేదు. సరే, ఆ సంగతి పక్కన పెడితే.. రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పది కోట్ల రూపాయల్ని ఏదన్నా ప్రభుత్వ కార్యాలయం ఖర్చు కోసం వినియోగిస్తే.. రాష్ట్రానికి ఉపయోగపడేది. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు విషయమై మొదటి నుంచీ విమర్శలున్నాయి. అధికార పార్టీకి అత్యంత సన్నిహితులైన ఓ వ్యక్తి ఆ గ్రూపులో కీలక పదవిలో వున్నారనీ, పేరు కన్సల్టెన్సీదే అయినా.. లబ్ది మాత్రం సదరు వైసీపీ మద్దతుదారుడిదనీ అప్పట్లో విపక్షాలు విమర్శించిన విషయం విదితమే.
10 కోట్లు.. చిన్న విషయమేమీ కాదు. గతంలో మూడు కోట్ల పై చిలుకు చెల్లింపు జరిపిన వైఎస్ జగన్ ప్రభుత్వం, తాజాగా మరో ఏడు కోట్ల పై చిలుకు చెల్లింపులు చేసింది. ‘ఎవడబ్బ సొమ్మనీ..’ అంటూ జనం ఓ పాటేసుకుంటున్నారు సోషల్ మీడియాలో ప్రభుత్వ తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తూ.!
503897 32266Real fantastic info can be located on internet weblog . 575015
413791 29546Thanks for providing such a fantastic write-up, it was excellent and really informative. Its my 1st time that I go to here. I located lots of informative stuff inside your article. Maintain it up. Thank you. 505044
461003 586995Wonderful post man, keep the nice function, just shared this with my friendz 441442