ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి కనీ వినీ ఎరుగని విపత్తుని తెచ్చిపెట్టేలానే వుంది. నిన్నటికి నిన్న దాదాపు 24 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. లక్షకు పైగా కరోనా టెస్టులు చేయడం ఆహ్వానించదగ్గ పరిణామమే. కానీ, ఇలా టెస్టులు చేయాల్సిందెప్పుడ.? కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంటే, పాలకులు కళ్ళు తెరిచిన పాపాన పోలేదు.
పొరుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి తీవ్రతను ముందే అంచనా వేయగలిగారు.. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించేశారు. కానీ, ఆంధ్రపదేశ్ ప్రభుత్వం మొండిగా వ్యవహరించింది. 10 వేల కేసులు రోజువారీగా నమోదవుతున్నా, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించి తీరతామన్నారు. కోర్టు సూచన నేపథ్యంలో కాస్త వెనక్కి తగ్గారంతే. ఇప్పుడు, ఇంత ప్రమాదకరంగా కరోనా తయారయ్యాక.. తాపీగా డ్యామేజీ కంట్రోల్ చర్యలు మొదలు పెట్టింది వైఎస్ జగన్ సర్కార్.
ఎల్లుండి నుంచి రాష్ట్రంలో 18 గంటలపాటు కర్ఫ్యూ అమల్లో వుంది. అంటే, నైట్ కర్ఫ్యూకి అదనంగా మరికొన్ని గంటలపాటు.. అంటే పగటి వేళ కూడా కర్ఫ్యూ వుండబోతోందన్నమాట. కేవలం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే ప్రజలు రోడ్ల మీద తిరిగేందుకు అనుమతి.. వ్యాపారాలు చేసుకోవడానికి వీలు.. అన్నమాట. ఆ తర్వాత జనం ఇళ్ళకే పరిమితమవ్వాల్సి వుంటుంది. అత్యవసర సర్వీసులకు మినహాయింపునిస్తున్నారు. దీన్ని మినీ లాక్ డౌన్ అని అభివర్ణించొచ్చు.
ఈ స్థాయిలో ఆంక్షలు కాకపోయినా, విద్యా సంస్థల విషయంలో జగన్ సర్కార్, తెలంగాణ ప్రభుత్వం తరహాలో ముందే మెలకువతో వ్యవహరించి వుండాల్సింది. చాపకింద నీరులా కరోనా విస్తరించాక, ఇప్పుడు ఆకులు పట్టకుని ప్రయోజనమేముంది.? చేతులు పూర్తిగా కాలిపోయిన పరిస్థితి వచ్చేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచినందుకు సంతోషం.. అన్న చర్చ రాష్ట్ర ప్రజల్లో జరుగుతోంది.
71090 948143Incredibly best man toasts, nicely toasts. is directed building your personal by way of the wedding celebration as a result are supposed to try to be witty, amusing and consequently unusual as well as. very best mans speech 590767
815136 736952actually great post, i definitely adore this site, keep on it 290459
364609 194754Dead written articles , Really enjoyed reading . 407775