న్యాయమూర్తుల్ని ఉద్దేశించి అధికార వైసీపీ నేతలు, కార్యకర్తలు చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలు అన్నీ ఇన్నీ కావు గడచిన రెండేళ్ళుగా. సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ మీద తీవ్రస్థాయి ఆరోపణలు గుప్పించారు.. అయితే, సర్వోన్నత న్యాయస్థానం ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని తేల్చడమే కాదు, జస్టిస్ ఎన్.వి. రమణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అవకాశమూ దక్కింది.
గతంలో, జడ్జిలపై వైసీపీ నేతలు, కార్యకర్తలు చేుసిన ఆరోపణల నేపథ్యంలో, అలాంటివారిపై చర్యలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఆ కేసులో ఇంతవరకు ఎంతమందిని అరెస్ట్ చేశారన్నది ఇప్పటికీ సస్పెన్సే. తాజాగా ఏపీ సీఐడీ, జడ్జిల మీద ఆరోపణలు చేసేవారికి అల్టిమేటం జారీ చేసింది. జడ్జిలపై ఆరోపణలు చేయడం తగదనీ, అలాంటి ఆరోపణలు ఎవరైనా సోషల్ మీడియా వేదికగా చేస్తే, చర్యలు తప్పవనీ హెచ్చరించారు ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సునీల్ కుమార్ హెచ్చరించారు.
నిజానికి, ఇది చాలామంచి హెచ్చరిక. న్యాయస్థానాల్లో వచ్చే తీర్పులు వాదోపవాదాలను బట్టి వుంటాయి. పైగా, తీర్పుల్ని పై కోర్టులో సవాల్ చేసే అవకాశమూ వుంటుంది. అలాంటప్పుడు, పనిగట్టుకుని న్యాయమూర్తులకు కులాన్ని ఆపాదించడమో, ఇంకో తరహాలో న్యాయమూర్తులపై జుగుప్సాకరమైన భాష ఉపయోగించడం ఎంతవరకు సబబు.?
ఏపీ సీఐడీ హెచ్చరించిందని బులుగు కార్యకర్తలు ఆగుతారా.? ఆ హెచ్చరికల తర్వాత కూడా సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా న్యాయస్థానాలపై జుగుప్సాకరమైన రాతలు కనిపిస్తున్నాయి. సాక్షాత్తూ అధికార పార్టీ నేతలే, తమ స్థాయిని దిగజార్చుకుని న్యాయస్థానాల తీర్పులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాక, వారి అడుగు జాడల్లో నడుస్తున్న కార్యర్తలెందుకు తగ్గుతారు.? హెచ్చరికలు మాత్రమే చేస్తే సరిపోదు.. సోషల్ మీడియాలో కనిపిస్తున్న జుగుప్సాకరమైన వ్యాఖ్యలకు సంబంధించి చిత్తశుద్ధితో కూడిన చర్యలు మొదలవ్వాల్సి వుంది.
706916 324790IE nonetheless is the marketplace chief and a large component of folks will pass over your magnificent writing because of this problem. 415453